ఏడవ ప్రకరణము
23
నప్పు డాతఁడు గ్రహింపఁగలిగెను. తానింతవఱకును సందే హించిన సంగతి వట్టి భ్రమ యని నిశ్చయించుకొనియెను—— బిందుసారుఁ డా బ్రాహ్మణకుమారీ రామణీయక విలాసములం బ్రత్యక్షముగఁ గన్ను లాఱఁ గనుంగొనియెను.
ఏడవ ప్రకరణము
పుత్రలాభము
మహారాజగు బిందుసారున కేఁబదిమంది రాణులు కలరు. ఇంత కాలమువఱకు వారిలో ధర్మాదేవి యొక్క తయే సార్వభౌమునకుఁ బ్రధానమహిషి యైయుండెను. మఱియు నామెయువ రాజగు సుషీమకుమారుని గన్నతల్లి – అందుచే నామె రాణులకందఱకు నధికారిణియై యుండెను. మహారాజు కూడనా మెమాటకు జవ దాట లేదు. ఈవిధముగఁజాల దినములు గడచినవి. బిందుసారుఁడు సుభద్రాంగిం జూచిన తరువాతనుండి యీ విషయమునం దించుక వ్యతిక్రమము గానవచ్చుచుండెను. రాజానుగ్రహము తీవ్రము గలనదీ ప్రవాహమువంటిది. అదియొకప్పు డొక తీరము నొఱసి భంగించు చున్నప్పుడు మఱియొక తీరమును బలపఱుచుచుండును. ఇప్పుడు మహారాజీ మణియగు ధర్మాదేవి తల తిరిగిపోవుచుండెను. క్రమక్రమముగా నిప్పుడామె ప్రభావ ప్రతిపత్తి తగ్గిపోవుచున్నది.