పుట:2030020025431 - chitra leikhanamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పక్షుల పాదములు వాని దేహములకు సమానముగా మధ్య నుండును. లేనియెడల పక్షి పడిపోవును. యేమిపని చేయుచున్నదో తెలియజేయుచు వ్రాయవలెను.

తోక కొన్నిసమయములయందుమీది కెత్తియుండును. మఱికొన్ని సమయములయందు దించి యుండును. ఎగురునప్పుడు ఱెక్క అనేకవిధముల నుండును. పక్షుల పతములు వ్రాయుటయందు దీని విషయమై మిగుల జాగరుకతతో నుండవలెను.

ఒక్కొక్క జంవువున కొక్కొక్క స్వభావముండును. చెవులపిల్లి ఎలుకను పట్టునటుల వ్రాసిన సందర్భముగ నుండును. కనుక దేనిస్వభావమును చూపుచు దానిని వ్రాయవలెను.