పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ననియు కవి హృదయము, శ్లేష దాసుగారి కంత రుచించదు గాని వారి శ్లేష మనకించక పోదు.

   ఉదా॥ చక్రభ్రమణ కరత్యా త్కుదృష్టిభి ర్ధూరం వర్జమానతాత్
          శ్రుత్యస్త ఖేవ్లవర్వాత్ మశక! త్వమేన మాధవం మన్వే(52)

మశకమునకు మాధవోపమ ! కవి కన్ను గురించి, లేఖిని గురించి షెక్సిపియరు చెప్పిన మాటలు గుర్తు వచ్చును. (చూ. Midsummer Night's Dream - Act V., Sc.i)

            "నీ జడన్ జూచినన్ జెలువఱేడు స్పురించె"
ఇత్యాది పద్యములో (పరిశిష్థము-పుట 1) స్మరణాలంకారము గలదు
        బలం దోరనం బాలకానా" మితి త్వం
        విధన్ మాం సమాశ్వాస యాతీవ మూఢం...,
        తులాయాం నమం దర్ధురాం స్తోలయేచ్చేత్...
ఇత్యాది శ్లోకములలోను (74, 75),
       "పాముం జావదు కఱ్ఱయున్ విరుగ దన్ వార్తాను సారంబుగా"

ఇత్యాది భావ సంపన్నులైన దాసుగారికి శబ్దాలంకారము నేడ మమకారము గానరాదు. అయితే యెందులోగాని "యమక పుష్టిగ చెప్పుట" నొక కవితా ముఖ్యాంశముగ పేర్కొనిరి. ఆ పద్దతి వారి హరికధలందలి మంజరులందును కీర్తనలందును గలదు. అందలి వచన రచనలందు కడమ శబ్దాలంకారము లెడనెడ గలవు. హరికషలు సభ కుద్దిష్టములు. శబ్దాలంకారములు పద్య సంబారంజన సమర్ధ ములు. వారి పద్యమురచనయం దవి సకృత్పతిరములు. ఆం దెక్కవగా దోసునది పోతనగారి యెరవడిని బడిన అంత్యానుప్రాస. మొదటి నాల్గు సారణులందు గల 188 పద్యములలో సుమారు ముప్పదింట నీలక్షణము గలదు. ఎక్కడను కక్కుర్తి కనిపించదు. ఉపరి అర్ధస్పూర్తి కతిమాత్ర దోహదము చేసినది. ఉదా॥ పుట 51:-

  ధనమా రాదు, దురాశ పోదు, పరతత్త్వజ్ఞానమా లేదు. కృ
  ష్ల్ణునియందా మది నిల్వబోదు, సుమబాలు న్నోర్వగారాదు, ని
  న్నెనయన్ లోకములోన వారు, విరహం బిల్లుండగానీదు, పా
  ప్లవ వంశంబు స్వతంత్ర మీదుచెలియా!వాంచల్ తుదల్ముట్టునే?