పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నయసూరి జీవితము 87

ఆంధ్రధాతుమాల

చిన్నయసూరి యాంధ్రభాషకు ధాతువులనుగూర్చి 'ఆంధ్ర ధాతుమాల' యనుపేర నొక గ్రంథమును రచించెనని యాంధ్రసాహిత్య పరిషత్తువారు క్రీ. శ. 1930 లో ముద్రించి ప్రకటించిరి. ఇది చిన్నయసూరి గ్రంథములయందు వ్రాఁతలో నాతని స్వంత యక్షరములతో లిఖింపఁబడియుండుట చూచి పరిషత్తువారు దానిని చిన్నయసూరి కృతముగా ప్రకటించి యున్నారు. కాని, గ్రంథమునందలి కొన్ని రూపములు పరిశీలించిన, అది యాతని రచన గాదని తెలియుచున్నది. ఈ 'ధాతుమాల'కు పీఠికను వ్రాసిన విద్వాంసులుకూడ ఈ కర్తృత్వ విషయమున కొంత సందేహమును చూపియుండిరి. ఆ సందేహము నిశ్చయమైనది. ఏలనఁగా దీనిని వాస్తవముగా రచించిన వారు వేదము పట్టాభిరామశాస్త్రులవారు.

ఆ విషయము బ్రౌనుదొరవారి వ్రాఁతలనుండియు, 'ఇల్లిసు' అను భాషా తత్వవేత్త ప్రకటించిన గ్రంథము వలనను తెలియఁగలదు. అందు చిన్నయసూరి మతమునకు విరుద్ధమైన ధాతువులు, వ్యావహారికములు చాలఁ గలవు. దీనిని గూర్చి నేను సమగ్రముగ వేదము పట్టాభిరామశాస్త్రిగారి 'పట్టాభిరామ పండితీయము' పీఠికలో చర్చించితిని. 'ధాతుమాల' సూరి రచన మెంత మాత్రమును కాదని సారాంశము.

ఆంధ్రశబ్ద చింతామణి వ్యాఖ్య

చిన్నయసూరి తన బాలవ్యాకరణమును నన్నయవిరచితమగు ఆంధ్రశబ్ద చింతామణి ననుసరించి రచించెనని బాల