పుట:2015.396258.Vyasavali.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సంపొదకీయ భూమిక | శ్రీ రామమూర్తిపంతులు గారు వ్యావహారిక భాషను పునఃప్రతిష్ఠితము చేయడానికి సునూరు పాతిక సంవత్సరములనుంచి చేస్తూన్న వాదములో ప్రధానముగా నాలుగు మార్గములు గోచరిస్తున్నవి. భాషాతత్వ ప్రదర్శనపూర్వకముగా ప్రపంచములోని ఇతర భాషా వాజ్మయముల చరిత్రనూలున్ను వాటితోపోల్చి ఆంధ్రభాషా వాజ్మయముల చరిత్రములను బోధించి తక్కిన భాషలవలె నే తెలుగుకూడా నానాటికి మారుగూ వచ్చినదనీ, ఆయా కాలముల కవులు తమనాడు శిష్ట వ్యవహార సిద్దమయిన భాషను కావ్యాలలో ప్రయోగిస్తూవచ్చి నాననీ, నేటి రచయితలు కూడా ఈ శిష్టాపొర మే పాటించి వ్యావహారిక భాషలో గ్రంథములు నా స్తే భాషా ప్రయోజనము చక్కగా నే వేరుతుందనీ, మోటిమాటకూ చేతి వ్రాతకూ సామరస్యము కుదిరి ఒక దాని కొకటి పోషకముగా ఉన్నప్పుడే వాజ్మయములోనీ భాష సహజముగానూ, సళముగానూ, సుబోధక వరు గానూ పరమ ప్రయోజనకారిగానూ ఉంటుందనీ నిరూపించడము ఒక మాగ్గము.

  • వ్యావహారిక భాషను బహిష్కరించి గ్రాంథికాంధ్రమును దాని స్థాన ములో నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉన్న వారు ప్రాచీన తాళపత్ర గ్రంథ ములలో ఉన్న లౌకిక భాషను ఎట్లు(గ్రాంథికీకరణము చేనీ కూటకరణ దోష మునకు పాల్పడి భాషను అపొగమయిన అనర్గము కలుగ జేసీ నారీగా ఋజువు చేసి పూర్వులు వ్రాసిన పురాణ (వచన) ములూ, లక్షణ గ్రంథమాలూ, న్యాఖ్యాన సలూ, టీక లూ, వివిధశాస్త్ర గ్రంథములూ, దేశచరిత్రపకులూ, జానపదవృత్తాంతములూ, వార్తాపత్రికలూ, శాసనములూ, కథలూ, బడి పుస్తక ములూ మొదలయిన అన్ని విధముల రచనల లోనూ వచనము వ్యావ హారిక భాషలో నే ఉన్నదని నిదర్శనపూర్వకముగా సిద్ధాంతీకరించి, ఏ భాషలోనయినా ఇదే నిజచుయిన వచనరచనా సంప్రదాయమని నిరూపించ డము రెండోది.

గ్రాంథిక భాష' అని మన పండితులు వ్యవహరించేదాని స్వరూపము ఇదమిద్ధమని నిర్ణయించడానికి వల్ల పడదనీ, మన వ్యాకరణములు పరస్పర విరుద్ద స-లు గానూ, అసమగ్రములు గానూ ఉండడమువల్ల ఏది తప్పో ఏది