పుట:2015.396258.Vyasavali.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

95

విన్నపము

లకు బొధించేవారు. సాధారణముగా 'గ్రంధము ' అనేది వ్రాయడమునకు ఆప్రాచీన భాషలే యోగ్యమయినవని అనుకొనేవారు. కొందరు బుద్దిమంతులు మాత్రము అప్పుడప్పుడు అక్కడక్కడ లేచి వాడుకలో ఉన్న దేశ భాషలలో కొన్ని గ్రంధములు వ్రాసి గురు శుష్రూష చేసిన జనులకు కొన్ని విద్యలు చెప్పుతూ వచ్చినారు. ప్రాచీన భాషా పండితులు ఇట్టివారిని చూచి ద్వేషించేవారు. మతగ్రంధములు--బైబిలు--దేశభాషలలో వ్రాయనిచ్చేవారు కాదు. అట్లు వ్రాయడానికి ప్రయత్నించిన వారిని వెలి వేసి కఠినముగా దండించేవారు. తర్కశాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము మొదలయిన శాస్త్రము లేవిన్నీ దేశభాషలలో వ్రాసేవారుకాదు. అట్లు వ్రాస్తే తమ మహత్మ్యము, తమశాస్త్రముల మహత్మ్యము పోవునని భయపడేవారో ఏమో! మొత్తానకు దేశభాషలు దిక్కు మాలినవిగా ఉండేవి. యూరపు దేశస్దులు ఇప్పుడు తమ దేశభాషలే ఎక్కువగా అభ్యసించి ఆదరిస్తున్నారు. అట్లే మన తెలుగుబాషకూడా సంస్కృత పండితుల దృష్టికి నీచభాషగా ఉండేది. ఇప్పటికి ఉన్నదని చెప్ప వచ్చును. సంస్కృతము ముందర ఇట్టి దేశబాషలు అపభ్రంశములు, గ్రామ్యాలు* వీటిలో గ్రంధము వ్రాస్తే నరకములో పడతారట! ఇట్టి భావములు గల పండితుల మాట తిరస్కరించి కొందరు దేశ భాషాభి మానులు, రసికులయిన వారు తమ వేష తమ వేష దేశభాషలయందు అభిమానముగలవారై నైకృతి భాషలలో వ్రాసిన గ్రంధములను మెచ్చుకొంటారని తెనుగునకు గౌరవము సంపాదించినారు.$ అట్టివారు ఎంత ఉదారవంతులో కదా!

     వారి ఉద్దేశ మేమి? సాంసాన్యజనులు సంస్కృత భాష పూర్ణముగా అభ్యసింపలేరు. ఆ భాషలో సంపూర్ణ పాండిత్యము కలిగితేనే కాని

_____________________________

  • "అపభ్రంకవి ప్రయంబావా నరకం యాంతిమాననా--

$ "స్వస్ధాన etc., ఆంధ్రశబ్ద చింతామణి--