పుట:2015.396258.Vyasavali.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
94

వ్యాసావళి

భాసలు అలాగు ఉండబట్టే కదా ఇప్పుడు వేయిమందికి ఒకడయినా అక్కడే జనులలో చదువు రానివాడు లేడు. స్త్రీలలో గానీ; పురుషులలో గానీ మనదేశమందు తెలుగుభాష గతి ఎట్టులున్నదో చూడండి. లోక వ్యవహారమందు పెద్దలు అందరూ నోటకు మాట్లాడేది ఇంచుమించుగా ఒకరి భాష అయినా, ఉత్తర ప్రత్యుత్తరములలో ఆ భాష అందరూ--పంటితులు కూడా--వాడుతూ ఉన్నా 'గ్రంధము ' అన్న వాటిలోను, వార్తాపత్రికలలోనూ, ఆభాష బుద్ధిపూర్వకముగా మానుకొని ఏదొ కృత్రిమ భాష, లోకములో ఎక్కడా ప్రవృత్తి లేనిది, (కొన్ని నేటినీ, కొన్ని మొన్నటినీ, కొన్ని కొత్తవీ, కొన్ని పాతవీ, కొన్ని ఎన్నడూలేక విశ్వామిత్ర సృష్టిలో పొడచూపినవీ--అన్నీచేరిన 'బాస ') ఎవరికి తోచినట్లు వారు కల్పించి వ్రాస్తున్నారు. ఇటుపయిని ప్రకటించే పత్రికలలో ఈకృత్రిమ గ్రాందిక భాష విమర్శించడమునకు ఉద్దేశించి ఉన్నాము. గనుక ఇక్కడ దానిని గురించి విస్తరించి చెప్పము. తెలుగువారి లో నాగరికులు స్వదేశభాష వ్రాయలేరన్నమాట యూరపులో వింతగా ఉంటుంది. నాగరికులు స్వదేశభాష మాట్లాడలేరంటే యూరపులో నవ్వుతారు పిచ్చిమాటని. మనతెలుగువారిలో తగు మనుష్యులే సిగ్గుపడకుండా అంటారు; "మేము తెలుగు మాటాడలెము. మరో పండితుడైనా మాటాడలేడు" అని. వాస్తవముగా వారు వ్రాయలేనిదీ, మాటాడలెనిదీ ప్రాచీనబాషగని ఇప్పటి భాషకాదు. నాగరికులైన ఇంగ్లీషు పండితులుగాని ఫ్రెంచి పండితులుగాని తమ దేశపు ప్రాచీనభాషలు ఆటాడనూలేరు. వ్రాయనూలేరు.

    కొంతకాలము క్రిందట మనదేశములో సంస్కృతము వలెనే యూరపులో లాటిన్ గ్రీక్ భాషలు ఎవరో కొందరు యావజ్జీవము వేరేపని లేకుండా అభ్యసించి పండితులయి చాలా గౌరవము పొంది, ఆ భాషలో ఉన్నప్రాచీనగ్రంధరాజములు చదివి వాటి అర్దమును దేశభాషలలో అను