పుట:2015.392383.Kavi-Kokila.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88 కవికోకిల గ్రంథావళి [సప్తమాంకము

తృతీయ స్థలము : వాల్మీకి కుటీరము.

________

[సీత ఆసీనయైయుండును.]

సీత : సూర్యభగవానుఁడు నభోమధ్యగతుఁడై వేడిసెకల నుమియు చున్నాఁడు. నా ముద్దుకొమరు లేలొకో యింతవఱకుఁ గుటీరమునకురారు. అయ్యో! యేమి నా కుడికన్నదరుచున్నది?

[మాండవ్యుఁడు ప్రవేశించును]

మాండ : అమ్మా, అమ్మా. ఆరణ్యకా - [దు:ఖించును]

సీత : నాయనా, మాండవ్యా, యెందుకు దు:ఖించుచున్నావు ? కుశలవు లెక్కడనున్నారు ?

మాండ : అమ్మా, యేమిచెప్పుదును ? ఇంకను గుశలవులా ? [దు:ఖించును.]

సీత : [తత్తరముతో లేచి] ఏమీ ? కుశలవులేమైరి? వా రిపుడెక్కడ నున్నారు ? వచ్చుచున్నారా? ఒక్కమాట చెప్పుము.

మాండ : అయ్యో ! నా నాలుక యాడకున్నది.

సీత : నా ముద్దుబిడ్డలకేమైన నాపద సంభవించెనా? మాండవ్యా, యేల విలపించెదవు ?

మాండ : ఎక్కడివో పాపిసైన్యములు కళ్యాణసరస్సుప్రాంతముల విడిసినవి. వారి సవనాశ్వమును కుశుఁడు కట్టివైచెను. సేనాధిపతి వచ్చునను భీతితో నేను దూరమున దాఁగియుంటిని. అంతలో సేనాని వచ్చెను.

సీత : తర్వాత ?

మాండ : తర్వాత కుశుఁడును సేనానాయకుఁడును ఏమేమొ వివా