పుట:2015.392383.Kavi-Kokila.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము

ప్రథమస్థలము : అడవి

[లక్ష్మణుఁడు ప్రవేశించును]

లక్ష్మ : దు:ఖగర్భితములగు పండ్రెండువత్సరములు గడచినప్పటికిని రామపత్నిని విడనాడిన యీ కాంతారస్థలముల దర్శింప, సీతాపరిత్యాగ సంతాపము నేఁటిదివలె నాహృదయతటము లొరసికొనుచుఁ బ్రవృద్ధమగుచున్నది.

                     ధరణిజా పదన్యాస పూతంబులైన
                     యటవులించుక మార్పుతో నైనఁగాంచ
                     నయ్యెఁగాని సీతాకార మాత్మఁ దక్క
                     దృశ్యలోకంబు ననునెందుఁ దేజరిలదు.

సీతావిరహితమైన యశ్వమేధము దు:ఖకరమైనను దన్మూలమున ఆర్యాపునర్దర్శనము లభించు నేమోయను కొండంత యాసతో వచ్చితిని. నా యాస నిద్రమేల్కొన్నవాని స్వప్నమువలె అదృశ్యమయ్యెను. [కొంత నడచి] అకటా ! నేనెంత ప్రాణఘాతుకుఁడను. అగ్రజుని యాజ్ఞగావించి మరణపర్యంతము వేధించు హృదయశల్యము దెచ్చికొంటిని.

                     రామసందేశ మేఁ దెల్పఁ గోమలాంగి
                     జానకీదేవి ప్రాణవిహీన యగుచు