పంచమాంకము]
సీతావనవాసము
౫౯
ద్వితీయ స్థలము : అంతర్భవనము
[రామ భరత వసిష్ఠులు కూర్చుండి యుందురు]
రాము : తమ్ముఁడా, నేనెంత కరుణాశూన్యుఁడను ?
చేతులారంగఁబెంచి చేఁజేతఁ బూవ
నున్న మల్లికఁ బెకలించు తెన్నుగాఁగఁ
బ్రాణములకన్న మిన్నయై పరగు ప్రియను
ఘోరకాంతారములఁద్రోసి కూళనైతి.
భర : అన్నా, నీవేయిటులఁ జింతించుచున్న మాబోంట్లగతి యేమి?
వసి : వత్సా రామచంద్రా, సర్వమెఱింగిన నీవే యిటుల నడుకానఁ బడుచున్నావు.
రాము : అంతపుణ్యము నా కలవడునా ?
వసి : గంధ సింధురము పంకనిమగ్నమైన దాని నుద్ధరించు వారలెవ్వరు? నీశోకమును దిగమ్రింగి తమ్ములను బుజ్జగించ వలసినవాఁడవు గదా.
రాము : మునీంద్రా, జానకిని దిగమ్రింగినవాఁడను, శోకమును దిగమ్రింగలేనా? కొండలు మ్రింగువానికి గండశిల లొక లెక్కయా?
భర : అన్నా, నీపరితాపమునకు మేరయే దొరకకున్నది. మాయల్పధైర్యముగూడ ప్రవాహ సంఘర్షణమున నైకతబంధమువలె కరఁగిపోవుచున్నది.
వసి : భరతా, యుమ్మలింపకుము, మీయన్న నూరడింపుము. చింతింప నేమి లాభముగలదు?