పుట:2015.392383.Kavi-Kokila.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54 కవికోకిల గ్రంథావళి [చతుర్థాంకము

ద్వితీయ స్థలము : అడవి

[వాల్మీకి, మాండవ్యుఁడు మాటలాడుచుండఁగా తెఱ యెత్తఁబడును.]

వాల్మీ : మాండవ్యా, నీవు చూచితిననిచెప్పిన సాధ్వి యెచ్చట నున్నది?

మాండ : ఇచ్చోటనే మూర్ఛిల్లి పడి యుండినది. ఇపు డెచ్చటికో పోయియుండును.

వాల్మీ : ఈవనమం దెయ్యెడనో వృక్షచ్ఛాయల విశ్రమించియుండునేమొ చూతము రమ్ము.

[నిష్క్రమింతురు.]

[తెఱయెత్తఁగా సీత తరుమూలమునఁ గూర్చుండియుండును.]

సీత : చిత్తమా, యూరక యేల యంతరాళసౌధములు నిర్మించెదవు? మున్ను లంకలో నశోకవనమున నివసించు చున్నప్పుడు నామనోనాయకుఁడు దానవ పతిని వధియించి నన్ను మరలఁ గొంపోవునను పేరాసతో మేన నసువులు భరియించితిగాని, యట్టి యాశావలంబము నేఁడు లేదుగదా.

[వాల్మీకి, మాండవ్యుఁడు ప్రవేశింతురు]

వాల్మీ : [స్వగతము] ఈకుమారియా! [ముక్కుపై వ్రేలిడికొని] ఆహా! అంతయుఁ దెలిసె. [ప్రకాశముగ] రామపత్నీ.

సీత : [ఉల్కిపడి లేచి - స్వగతము] ఎవరో మునీశ్వరులు! నన్నెటు గుర్తించిరి? [ప్రకాశముగ] మహాత్ములారా, వందనములు.

వాల్మీ : దీర్ఘ సుమంగలీ భవ!