ఈ పుట అచ్చుదిద్దబడ్డది
40 కవికోకిల గ్రంథావళి [చతుర్థాంకము
హల్లకల్లోలంగా వుంది.
మధు : అయ్యో పాపము ! యీసంగతి రాణిగారికి తెలిసివుంటే మునికన్నెల చూడడానికి పొయ్యేవుండదు.
మందా : దేవిగారు బయలుదేరిన వెనుకనే ప్రెభువుగారికి జన్ని పట్టినదఁట.
మధు : అయ్యో! నీవొక్క మారైనా దరిశింపలేదా యేలివారిని.
మందా : వైద్యుగుల వుత్తరవులేనిదే రాజబందుగులు గూడ అక్కడికి పోగూడదని భద్రుఁడు చెప్పినాఁడు.
[నేపథ్యమున]
ఒసే మందారికా, నీవింకా యిక్కడనే పెత్తనము చేయుచున్నావా ?
మందా : వాడుగో!భద్రుఁడు అరుస్తున్నాడు. తొందరగా పోవలెను. ఆ ముసిలి కట్టెతో నా కత్తకోటరికమైనది. [పోఁబోవును]
మధు : మందారికా, యిట్లెక్కడికి పోతున్నావు ?
మందా : నవగ్రహదానా లియ్యడానికి కొట్టిడీనుండి నవధాన్యాలు తెమ్మని పురోహితుఁడు పంపించితే పోతున్నాను.
మధు : సరేపొమ్ము, సాయింత్రం అక్కడికి వస్తాను.
[ఇరువురు నిష్క్రమింతురు.]