పుట:2015.392383.Kavi-Kokila.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26 కవికోకిల గ్రంథావళి [తృతీయాంకము

రాము : [ఉద్వేగముతో] హా ! యేమి వినుచుంటిని. భద్రా, యేమంటివి? జానకిని నిందించిరా లోకులు ?

భద్రు : జానపదులు నీరుదెచ్చుకొను బావికడ నొకపల్లెత యేమేమొ యపవాదములు పలుకుచుండెను. నే నెట్లు చెప్పఁగలను ?

రాము : భద్రా, యళుకు పడవలదు.

భద్రు : రావణుఁ డెత్తుకొనిపోయి తనయింట నుంచుకొనిన సీతను మరల రాముఁడు పరిగ్రహించెను; కౌసల్యాదేవి యింటఁబెట్టికొనుటకు సందేహింప లేదు. కౌసల్యయే నేనైన కోడలి నిప్పుడే యిల్లు వెడలించి యుందునని యేమేమొ యసంబంద్ధము లాడుచుండెను.

రాము : ఔరా ! మందభాగ్యుఁడనగు నన్నుగుఱించి సాధ్వీమతల్లియగు కౌసల్యా దేవికింగూడ నిందాపాదనమూ ! అకటా ! వంచింపఁబడితిని. శైత్యమునకై శ్రీఖండతరువు నాశ్లేషించితిఁగాని, కోటర నిలీనయగు విష భుంజగిని గాంచనైతి. ఛీ ! దుష్టహృదయమా, వహ్ని పరిశుద్ధయైన సీతను సైతము సంశయించుచున్నావా ?

భద్రు : రామభద్రా, యవివేకుల యాడికోలు పాటింపఁదగదు.

రాము : ఓయీ, సత్యముపలికితివి.

                    ఏ లలితాంగి సచ్చరిత మెల్లజగంబులఁ బాపవల్లికా
                    మూల ఖనిత్రమై భువనపూజ్యమునై నుతికెక్కె, నట్టి నా
                    పాలిటి భాగ్యలక్ష్మి యపవాదభరంబునఁ గ్రుంగునట్లు కాం
                    తాళముతోడ లోకు లనఁ దాలిమినొందునె చిత్త మిత్తఱిన్ ?

ఓ నిర్విచారప్రపంచమా, నీకు గాలావధి యయ్యెఁ గాఁబోలు