పుట:2015.392383.Kavi-Kokila.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవికోకిల గ్రంథావళి


రాజ : మాధవుని కంఠస్వరమువలె నున్నది.

కటి : [తొందరగ చదువును]


                      గండ్రగొడ్డలికి సత్తెమువుంటె కాళమ్మవుంటె
                      వొక్క యేటుకే మొండెమునుంచి పూడిపోవు సిరసు.

                                                                    [గొడ్డలి పైకెత్తును]

రాజ : ఊడిపోదురా నరపిశాచీ, ఊడిపోదు. [ఎత్తిన గొడ్డలిని పట్టుకొనును]

కటిక : [తిరిగిచూచి] ఒయ్యొ, ఒయ్యొ, దెయ్యం, దెయ్యం. చిన్న దొరయ్య దెయ్య మయ్యాడు. [పెద్దకేకవేయును, భటులు భయపడుదురు]

రాజ : నేను మరణించితిననుకొని యుండిరా?

మాల : నేను సందేహించినట్లే యైనది. మనము సమయమునకు రాకున్న!

మాధ : [మెల్లఁగ తలయెత్తి కన్నులకు గట్టుకొని రుమాలువిప్పి] ఏమి దయ్యమురా? [రాజశేఖరుని చూచి] ఆ! నన్ను బ్రతికించుటకై స్వర్గమునుండి పరుగెత్తుకొని వచ్చితివా?

రాజ : [మాధవుని కౌఁగిలించుకొని] మాధవా, యిదియేమి దురవస్థ?

మాధ : నీవు నిజముగ బ్రతికియున్నావా? స్వప్నము కాదుకదా? [రెండు భుజములు పట్టుకొని కుదలించును]

కటిక : [భటులతో జనాంతికము] మణిశిలాగే వుండాడు. సావలేదురో, అయ్య.

మాధ : నిన్ను హత్యచేసితినని మీతండ్రి నాకు మరణదండనము విధించెను.

రాజ : అయ్యో! ఎంత ప్రమాదము. ఒక్కనిమిష మాలస్యమై యుండిన తీఱరాని దు:ఖము ననుభవించి యుందుము.