౨౨
కవికోకిల గ్రంథావళి
[తృతీయాంకము
[మందారిక ప్రవేశించును.]
మందా : [స్వగతము] అంత:పురమున నమ్మకమైన దాసిగనుండుట కన్న బావిలోపడి చచ్చుటమేలు. ఏపనికైనను మందారికయే పోయి చావవలయును. ఆ పురోహితుఁడు ఎక్కడ బ్రాహ్మణార్థము చేయుచున్నాఁడో యెట్లు కనుగొందును? వాఁడుగో ! భద్రుఁడు, దివాణము దిక్కునకే వచ్చుచున్నాఁడు. అతని నడిగినఁ దెలియును. ఈ ముసలిభద్రుఁడు అంత:పురమున తా నొక్కఁడే విశ్వాసపాత్రుఁడని గర్వపడుచుండును. అతని కొకింత శివమెక్కించిపోయెదను. [మందారిక తొలఁగి తొలఁగిపోవుచుండును.]
మందా : [పలుకదు.]
భద్రు : ఎవరది ? మందారికా, ఏమిపలుకవు ?
మందా : ఏమియాపదగలిగినది, ప్రాణముపోయేట ట్లరుస్తున్నావు ?
భద్రు : ఓసి తొత్తుకూఁతురా,ఏమితొలఁగితొలఁగిపోవుచున్నావు ?- మందా : నీవంటి నవకోటిమన్మథాకారుని రాచుకొని పోవలయునా ? [పోవుచుండును.]
భద్రు : మాటలలోనే దాఁటిపోవుచున్నావె ! ఇటురమ్ము. నీయొడిలో నేమొదాచుకొని పోవుచున్నావు. ఏమైన దొంగిలించవు గదా ?
మందా: నీపనికి నీవుపొమ్ము. తక్కినపనితో నీకేమిసంబంధము? దివాణమంతయు నీ మొగముపై నడచుచున్నదా?
భద్రు : ఒసే బానిసకూతురా, మహారాజంతవాఁడు నన్ను పల్లెత్తు మాటయనరు. నీవా నన్ను తిరస్కరించుదానవు? రామభద్రుని శైశవమునుండి నేను సేవకుఁడను సుమా.
మందా : అబ్బా ! అయోధ్యారాజ్యమును రక్షించితివి నీవువచ్చిన రాజకుటుంబము పుట్టిమునుగును. [పోవ ప్రయత్నించును.]