పుట:2015.392383.Kavi-Kokila.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఏడు] కుంభ రాణా 189

రాణా : పిలిపింపుడు.

శ్యామ : ఓరీ.

ద్వారపాలకుఁడు : స్వామి.

శ్యామ : నీవు శీఘ్రముగాపోయి దునీచంద్‌ శేటును రాజాజ్ఞగా పిలిచికొనిరమ్ము. తలారియొద్ద తీసికొనిన మొహరీనిగూడ తీసికొనిరమ్మనుము.

ద్వార : చిత్తం. [నిష్క్రమించును.]

రాణా : మనవేగువారు చాలాప్రమత్తులయినటుల కనఁబడుచున్నారు. లేకయున్న పరదేశీయులు మాఱువేసములతో సంచరించియు, అంత:పురమున దూరియు తప్పించుకొని పోగలుగుదురా ?

శ్యామ : ఈతూరి ప్రమాదమే జరిగినది.

రాణా : తీవ్రముగ మందలింపుడు.

శ్యామ : చిత్తము.

[దునీచంద్ శేటు ప్రవేశించును.]

దునీచంద్ శేటు : [తలారి మురళీదాసును చూచి రహస్యముగ] ఏమిరా యీసంగతి రాజుగారిదాకా తెచ్చావా? ఉండు ! భడవా, నీసంగతి చెప్పిస్తాను.

మురళి : చూడండి ధొరగారూ, యీ శేటుగా రేమంటున్నారో.

దునీ : జయము, జయము ఏలినవారికి ! ధొరగారి వుత్తరువైతే యీ మొహరీ వాడికిస్తానని చెప్తున్నానండి.

మురళి : [స్వగతము] ఆ - వూరికే యిస్తావా, వుంగరాల చేతి ముట్టు దగిలితే పెద్దమణిశి లాగా యిస్తావు.

శ్యామ : నీవుపోయి, నీ నవుకరి చూచుకొమ్ము. మేము విచారించి