స్థలం ఏడు] కుంభ రాణా 189
రాణా : పిలిపింపుడు.
శ్యామ : ఓరీ.
ద్వారపాలకుఁడు : స్వామి.
శ్యామ : నీవు శీఘ్రముగాపోయి దునీచంద్ శేటును రాజాజ్ఞగా పిలిచికొనిరమ్ము. తలారియొద్ద తీసికొనిన మొహరీనిగూడ తీసికొనిరమ్మనుము.
ద్వార : చిత్తం. [నిష్క్రమించును.]
రాణా : మనవేగువారు చాలాప్రమత్తులయినటుల కనఁబడుచున్నారు. లేకయున్న పరదేశీయులు మాఱువేసములతో సంచరించియు, అంత:పురమున దూరియు తప్పించుకొని పోగలుగుదురా ?
శ్యామ : ఈతూరి ప్రమాదమే జరిగినది.
రాణా : తీవ్రముగ మందలింపుడు.
శ్యామ : చిత్తము.
[దునీచంద్ శేటు ప్రవేశించును.]
దునీచంద్ శేటు : [తలారి మురళీదాసును చూచి రహస్యముగ] ఏమిరా యీసంగతి రాజుగారిదాకా తెచ్చావా? ఉండు ! భడవా, నీసంగతి చెప్పిస్తాను.
మురళి : చూడండి ధొరగారూ, యీ శేటుగా రేమంటున్నారో.
దునీ : జయము, జయము ఏలినవారికి ! ధొరగారి వుత్తరువైతే యీ మొహరీ వాడికిస్తానని చెప్తున్నానండి.
మురళి : [స్వగతము] ఆ - వూరికే యిస్తావా, వుంగరాల చేతి ముట్టు దగిలితే పెద్దమణిశి లాగా యిస్తావు.
శ్యామ : నీవుపోయి, నీ నవుకరి చూచుకొమ్ము. మేము విచారించి