పుట:2015.392383.Kavi-Kokila.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాంకము

_________

ప్రథమ స్థలము : సభామంటపము

_________.

[రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, వసిష్ఠమహర్షియు ఆసీనులై యుందురు.]

వసి : రామచంద్రా, ఋశ్యశృంగమహర్షి యజ్ఞదీక్ష వహించి మనకు నాహ్వానపత్రిక నంపియున్నాఁడు

రాము : విషయము వినిపింపుఁడు.

వసి : జానకి ఆపన్నసత్వ; దూరప్రయాణాయాసమున కోర్వఁ జాలదు. రామచంద్రుఁడు సీతావినోదార్థ మచ్చటనే నిలుచుఁగాక; కౌసల్యాది మహాదేవులును, లక్ష్మణ భరత శత్రుఘ్నులును, వసిష్ఠాది ఋషీశ్వరులును, దక్కిన బంధుమిత్రులును దర్శానార్థము విచ్చేయఁ బ్రార్థితులు.

రాము : మునీంద్రా, మాబావగారి సీతాపక్షపాతమువలన యజ్ఞ సందర్శన కుతూహలమునుండి తొలఁగింపఁ బడితిని. మునిపుంగవు లెల్లరు యాగమంటపము నలంకరించి ఋశ్యశృంగమహర్షిని గృతకృత్యుని గావింపుఁడు.

వసి : వత్సా, సవనమన్నఁ దాపసులకుఁ బండువుగదా.

రాము : భరతా, ప్రయాణసన్నాహము లొనరింపుము.

భర : ఆజ్ఞానువర్తిని.

[భరతుఁడు నిష్క్రమించును.]