స్థలం ఏడు] కుంభ రాణా 183
గారికిగూడా తెలిసినట్లే యున్నది.
రాణా : [కోపముతో] ఓయీ, పిచ్చిబ్రాహ్మణుఁడా, నీవు కన్ను లుండియు చూడలేవు; వీనులుండియు వినలేవు; తలయుండియు నాలోచింపలేవు. ఇట్టి యమూల్య హారములను నిశ్చింతముగ కానుక యియ్యఁగల వైద్య వేషధారులకు నీవిచ్చు బీదసంభావన లెందుకు?
బల : [ఆశ్చర్యముతో] వేషధారులా వారు!
రాణా : కాక, మఱియెవ్వరు ?
సుశీ : [స్వగతము] ఈ ముసలాయనకు మూడుచిట్ల ముక్క జొన్నలు బత్తెం పడేలాగుంది.
[మంత్రు లిరువురు ప్రవేశింతురు]
మంత్రులు : జయము, జయము !
రాణా : విచ్చేయుఁడు.
[మంత్రులు కూర్చుండుదురు]
రాణా : శ్యామలరావుగారూ, మన యంత:పురమున వింతలు పుట్టుచున్నవి. ఈ హారమును చూచితిరా ? [శ్యామలరావు చేతికిచ్చును.] దీని ఆదాసివేసికొని తిరుగుచుండఁగా మఱియొకదాసి చూచి బలవంతరావుగారి కెఱిఁగించెను.
సుశీ : [స్వగతము] చూపోపలేక ఆ మాయలాడి తొత్తుకూతురు వాసంతిక మోసంచేసి వుంటుంది. ఈ ముసలిబాపడికి నేనంటె కళ్ళల్లో కారం చల్లినట్లుంటుంది.
రాణా : నిన్నటిదినమున ఎవరో యిద్దఱు వైద్యులు మన యంత:పురమునకు వచ్చి మీరాకు ఈహారములను నజరిచ్చి పోయిరఁట !
శ్యామ : వైద్యులా యిట్టిహారములను బహుమతిచేయుట !