172 కవికోకిల గ్రంథావళి [స్థలం ఐదు
తాన్ : 'నీవు నిన్నెఱుఁగవా? నీవు శ్రీకృష్ణుఁడవు గావా ?' యను వాక్యముతో మనకు చిరంతన సత్యమును బోధించినది.
సుశీ : [కనులెత్తి] అబ్బో! మరల దోమరాటుకూడా యెక్కువైంది. [పైటతో విసరుకొనుచు] కన్నట్టైమూయనీయ వీ పాపిష్టిదోమలు - అయ్యా, యేమైనా మందిచ్చిపోతున్నారా ? కుప్పెకట్టయితే మఱొక్క సుట్టు యెక్కువగా సాదియ్యండి. కాస్త యిచ్చాపత్తెం పెట్టండి. పాపం మారాణిగారు ఇప్పటికే సన్నగిల్లి పోయారు.
అగ్బ : ఆమెపిచ్చికి ఆమెయొద్దనే మందుగలదు. దానిని మేము గూడ కొంచెము గ్రహించితిమి.
సుశీ : [స్వగతము] వీళ్ళకుగూడా పిచ్చిపట్టిందాయేంటి ! ఈపిచ్చి అంటురోగమాల అందరికీ తగులుకొనేటట్టుంది. ఈ గాలితగిలి నాకుగూడ పిచ్చిపట్టిందోయేమొ అద్దముచూచుకొనివస్తాను. [నిష్క్రమించును.]
అగ్బ : ఈదాసి మనల ననుమానించి యుండదుకదా.
తాన్ : అది తూగుబోతు.
అగ్బ : తల్లీ, ఈగురుకట్నమును గ్రహింపుము. ఈ హారమును శ్రీ కృష్ణునకు స్వయంవర హారముగ సమర్పింపుము.
[మీరాబాయి అంజలిలో హారమును విడచును.]
తాన్ : ఈబీదకట్నమునుగూడ సంగ్రహింపుము. [పూవులదండను దోసిట విడచును.]
[దండముపెట్టి యిరువురు నిష్క్రమింతురు. ధ్యాన నిమగ్నయైయున్న మీరాబాయి చేతిలోనుండి హారము క్రిందికి జాఱిపడును.]
సుశీ : [ప్రవేశించి] అద్దములో చూచుకొంటె ముందరి మొఖం