10. కవికోకిల గ్రంథావళి [ప్రథమాంకము
ఊర్మి: అక్కా, గడచినది గదా యారణ్యవృత్తాంతము.
సీత: అయినను అందనుభవించిన సుఖదు:ఖావస్థలు మఱపునకు వచ్చునవియా ? జనస్థానమునఁ బదునాలుగువేల కంచురథముల రక్కసులతో నసహాయ శూరుఁడయి పోరి, వారినుక్కడంచిన ఆర్యపుత్రుల శౌర్యమూర్తి నేఁడు దర్శించినటులఁ బొడకట్టుచున్నది.
ఖరదూషణాది దైత్యో
త్కరముల నురుమాడి, రుధిరధారలు దొరఁగన్
శరజ క్షతములఁ గాంతుఁడు
వఱలెను కింశుకము బూతపట్టిన యటులన్.
ఊర్మి: అక్కా, శూర్పణఖా పరిభవానంతరము గదా ఈ సమరము జరిగినది.
సీత: అవునవును ! ఆ దానవి కడుమాయలమారి పిశాళి జంత.
'నిను మ్రింగెద' నని యసురాం
గన బాహువు లప్పళించి ఘన ఘోషమునన్
నను దరియరాఁగ నగ్రజు
పనుపున నీప్రియుఁడు దానిఁ బరిభవ పఱచెన్.
ఊర్మి : అ రక్కసికి మంచి శాంతి పూజయే జరగినది.
సీత : ఊర్మిళా, యాదైత్యాంగనయేగదా నాయపహృతికి మూలము !
ఊర్మి : [ఆశ్చర్యవిషాదములతో] ఏమీ ! దాని యకార్యమా యది యంతయు ?
సీత : చెల్లెలా, కాలము గానియపుడు అమృతముగూడ విషమగు