పుట:2015.392383.Kavi-Kokila.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. కవికోకిల గ్రంథావళి [ప్రథమాంకము

ఊర్మి: అక్కా, గడచినది గదా యారణ్యవృత్తాంతము.

సీత: అయినను అందనుభవించిన సుఖదు:ఖావస్థలు మఱపునకు వచ్చునవియా ? జనస్థానమునఁ బదునాలుగువేల కంచురథముల రక్కసులతో నసహాయ శూరుఁడయి పోరి, వారినుక్కడంచిన ఆర్యపుత్రుల శౌర్యమూర్తి నేఁడు దర్శించినటులఁ బొడకట్టుచున్నది.

                    ఖరదూషణాది దైత్యో
                    త్కరముల నురుమాడి, రుధిరధారలు దొరఁగన్
                    శరజ క్షతములఁ గాంతుఁడు
                    వఱలెను కింశుకము బూతపట్టిన యటులన్.

ఊర్మి: అక్కా, శూర్పణఖా పరిభవానంతరము గదా ఈ సమరము జరిగినది.

సీత: అవునవును ! ఆ దానవి కడుమాయలమారి పిశాళి జంత.

                    'నిను మ్రింగెద' నని యసురాం
                    గన బాహువు లప్పళించి ఘన ఘోషమునన్
                    నను దరియరాఁగ నగ్రజు
                    పనుపున నీప్రియుఁడు దానిఁ బరిభవ పఱచెన్.

ఊర్మి : అ రక్కసికి మంచి శాంతి పూజయే జరగినది.

సీత : ఊర్మిళా, యాదైత్యాంగనయేగదా నాయపహృతికి మూలము !

ఊర్మి : [ఆశ్చర్యవిషాదములతో] ఏమీ ! దాని యకార్యమా యది యంతయు ?

సీత : చెల్లెలా, కాలము గానియపుడు అమృతముగూడ విషమగు