పుట:2015.392383.Kavi-Kokila.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఒకటి] కుంభరాణా 135

[హిందూ యాత్రికుల వేషముధరించిన తాన్‌సేను ఇస్మాయిల్ ప్రవేశితురు.]

తాన్‌సేన్ : ఆహా, యేమి యీచిత్రము ! గర్భగుడి చీఁకటిలో మినుకుమినుకు మని నక్షత్రములవలె వెలుఁగుచున్న ఈ దీపములు మూల ప్రకృతిలో మెఱయుచున్న జీవాత్మలో యనునట్లున్నవి ! ఈ యగరు దూపము, ఈ కర్పూర సౌరభ్యము, ఇవి యన్నియుంజూడ మన మెదో యొక దివ్యప్రపంచమున సంచరించుచున్న ట్లున్నది. మన శ్రమకు మించిన ప్రతిఫల మబ్బినది.

ఇస్మాయిల్ : తాన్ సేన్ జీ -

తాన్ : జాగ్రత -

యిస్మా : మఱచితిని. గురూజీ, ఇచ్చట ప్రాణరహితములగు శిలలు కూడ పవిత్రము లైనవో యనునట్లు భయ భక్తులను పురి కొల్పు చున్నవి. మీరాబాయి గాన మాధుర్యముచే మెత్తవడి, భక్తుల యడుగు రాపిళ్ళకు అఱుగు వాఱిన ఈ శిలా ఫలకములు గూడ మానవ కారుణ్యమునకు పాత్రములగు చున్నవి.

తాన్ : నేను హిందూ దేవాలయము లోనికి ప్రవేశించుట కిదియే మొదటితూరి. ఇట్టి యానందము నే నెప్పుడును అనుభవించియుండలేదు. మనము పునీతులమైతిమి. మనజన్మము సార్థకమైనది.

అర్చ : [తీర్థపు గిన్నెలోని రూకలను ఎంచుకొనుచు] దమ్మిడి యాగాణి, అణా, ...ఒక వెండిరూకైన వేసిన పాపాత్ముడులేడు. లేకలేక ఒక బేడరూక పడితే అదికూడా చెల్లనిదే ! వీళ్ళభక్తి యిట్లా బద్దలవుతుంది.

[డబ్బులు తీసి రొండిన దోఁపుకొనును.]