పుట:2015.392383.Kavi-Kokila.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108 కవికోకిల గ్రంథావళి [అష్టమాంకము

[వాల్మీకి కుశలవులు ప్రవేశింతురు]

వాల్మీ : రామభద్రా, మంగళ మగుఁగాక !

రాము : మునీంద్రా, భవదాగమమునఁ గృతార్థుఁడ నైతిని.

మునులు : తథాస్తు. తథాస్తు.

రాము : [స్వగతము] లక్ష్మణుఁ డెఱిగించిన సౌందర్యమూర్తు లీ యిరువురు వటువులై యుందురా ?

[సభలో గుజగుజలు]

రాము : మునీంద్రా, యీ తాపస వటువు లెవ్వరి కుమారులు ?

వాల్మీ : వీరొక వనవాసిని బిడ్డలు.

లవు : [జనాంతికము] అన్నా, యీ యజమానుఁడేనా రామాయణ కథానాయకుఁడు ?

కుశు : అట్లే తోఁచుచున్నాఁడు. తమ్ముఁడా, యీ శాంతస్వరూపుని దర్శించినంతఁ దల్లినిగాంచినంత యనురాగ ముప్పతిల్లుచున్నది !

లవు : అన్నా, వాల్మీకితాత సత్యమే వర్ణించును.

రాము : మునీంద్రా, ఆ వనవాసిని యెవ్వతె ?

వాల్మీ : ఎవ్వతెయో యొకగర్భిణి వనముల నిస్సహాయయై పరితపించుచుండ, నే నాశ్రమమునకుఁ దీసికొనిపోయి కుమారీ నిర్విశేషముగఁ బోషించుచుంటిని.

రాము : తాపసోత్తమా, యీనిర్హేతుకవాత్సల్యము మీ దివ్యచిత్తమున కనురూపమైనది - తరువాత ?

వాల్మీ : కొన్నిదినముల కా సీమంతిని యీకవ బిడ్డలను బ్రసవించెను.

రాము : [స్వగతము] ఆహా! యీ సుందరకుమారులఁ గాంచిన