పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధవశతకము

521


డై యుద్వాహము బొంది రట్టిచరితం బాలించు మర్త్యాళికిన్
బాయున్ సంసృతిపాశబంధములు సంభావింపఁగన్ మాధవా.

15


శా.

నీనామంబు స్మరించెనేని దురితానీకంబు నిర్మూలకం
బౌనంచున్ మదిలోఁ దలంచుచును నిత్యంబున్ భవన్నామమే
శ్రీనారాయణ వాసుదేవ యనుచుఁ గృష్ణా స్మరింతున్ జుమీ
దీనుండ న్ననుఁ బ్రోవుమా కరుణతో దేవా హరీ మాధవా.

16


మ.

తొలి సాధుండు గజేంద్రుఁ డమ్మొసలిచే దుర్వారబాధాప్తివి
హ్వలుఁడై నిన్ను హరీ హరీ యనుచుఁ బ్రోవన్ వేడుకోఁగా దయా
కలితస్వాంతుఁడవైన నీవు మొసలిన్ ఖండించి నాగేంద్రునిన్
పలరన్ బ్రోచితి వయ్యెడన్ మనుపుమయ్యా నన్ను శ్రీమాధవా.

17


శా.

సోమాదిత్యులు మీకు నేత్రయుగ మౌచున్ జీఁకటిం గొట్టి యు
ద్దామం బైనవెలుంగు లోకముల కొందన్ జేయుచున్నారు ము
న్నామందాకిని నీదుపాదములయం దావిర్భవించెంగదా
నీమాహాత్మ్యము నా కెఱుంగ వశమే నే మూఢుఁడన్ మాధవా.

18


మ.

అల బాణాసురుఁ డాజిరంగమున డాయ న్వచ్చినన్ వాని దో