పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/531

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

520

భక్తిరసశతకసంపుటము


జాతంబుల్ ఘనగీతముల్ విని యతిశ్రావ్యంబులై యుంట సం
ప్రీతిం బొందిరి వారొనర్చిన తపశ్శ్రీ యెట్టిదో మాధవా.

11


శా.

రాసక్రీడ లొనర్ప గోపక వధూరాజ్యంతరస్థుండవై
నాసాగ్రంబున మౌక్తికం బమర మందస్మేరవక్త్రంబుతో
భాసిల్లంగను దొంటినోములఫలంబా యంచు వా రెన్నఁగన్
నీసాన్నిధ్యము వారి కబ్బెనుగదా నిత్యంబు శ్రీ మాధవా.

12


శా.

నీసందర్శన మాచరించిననరుండే మోక్షముం బొందెడున్
నీసేవన్ సతతం బొనర్చుపురుషుండే మంచి ధన్యాత్ముఁడౌ
నీసూక్తుల్ వినినట్టిమానవులకు నిత్యంబు వైకుంఠసం
వాసం బబ్బునటంచుఁ జెప్పఁగఁదగున్ బక్షీధ్వజా మాధవా.

13


శా.

నిన్నున్ జూడని కన్ను లేల యెపుడున్ నీస్తోత్రమున్ జేయలే
కున్నన్ జిహ్వ యదేల నిన్ను మదిలో నూహించి ధ్యానింపలే
కున్న జిత్త మదేల నీకుఁ గుసుమవ్యూహంబుచేఁ బూజలన్
బన్నన్ లేని కరం బదేల యనుచున్ వాక్రుచ్చెదన్ మాధవా.

14


శా.

నీయాలింగనసౌఖ్యముం బొరయ నెంతేఁ గోరుచున్నట్టి స
త్యాయోషామణియున్ మొద ల్గలుగు నబ్జాక్షుల్ నినుం జూచువా