పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/530

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధవశతకము

519


క్కపరిన్ బీల్చి వధించినాఁడవు జగత్కళ్యాణదా మాధవా.

7


మ.

పటుకేయూరపరిష్కృతంబయిన నీబాహాచతుష్కంబు ది
క్తటముల్ నిండినశోభతో నెనయఁ బద్నాల్గౌనలోకాళి యు
త్కటభారంబు వహింతు వీ వని జనౌఘం బెన్ను నే నీదయా
స్ఫుటవీక్షావళి సోఁకి రక్ష నిడునంచున్ దెల్పెదన్ మాధవా.

8


మ.

యమునాతోయములందు గోపికలతో నానంద మొప్పన్ విహా
రము గావించుచు శీకరంబు లరుదారన్ జల్లుకొన్నట్టికా
లమునన్ వారికి గల్గినట్టిసుఖము ల్వర్ణింప శక్యంబె యా
ప్రమద ల్చేసినపుణ్య మిట్టిదియొ చెప్పంజాల నో మాధవా.

9


శా.

శూరుండౌ నరకాసురుండు జగముల్ క్షోభింపఁగా జేసి చె
న్నారంగాఁ బదియాఱువేలనృపకన్యాశ్రేష్ఠలన్ బల్మిచేఁ
గారాగారముఁ జేర్ప నయ్యసురునిన్ ఖండించి బంధస్థలౌ
వారిన్ నీవు వదల్చి యందఱ సుఖంపంజేసితౌ మాధవా.

10


శా.

నీతోడన్ సహకారులై నిరతమున్ నీసత్కృపాపాత్రులై
గోతండంబుల మేపుగోపకులు పెక్కుల్ గా భవద్వేణుసం