పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

516

ఈశతకమునందలి ప్రతిపద్యము భక్తిరసోద్బోధకమై మృదుమధురభూయిష్టమై శ్రావ్యముగ నున్నది. ఎనుబదియెనిమిదవపద్యము మొదలుకొని పండ్రెండుపద్యము లంత్యనియమాలంకారముతో మనోజ్ఞముగా రచింపబడినవి. పదజటిలము, నియమపరిపాటి, ధారాసౌష్టవము బట్టిచూడ నాయాపద్యములు కృతుల కాశ్వాసాంతములందుఁ జేర్పఁదగినవిగాఁ దోచుచున్నవి.

తొలుత నీశతకము కీ॥శే॥ చెలికాని లచ్చారావుగారి శతకసంపుటములందు ముద్రితమయ్యెను. పిదప మేము ప్రకటింపఁబోవు భక్తిరసశతకముల సంపుటములలోఁ బ్రచురించుటకు అనుజ్ఞ నొసంగి మాయుద్యమమునకుఁ దోడ్పడిన శ్రీ అల్లమురాజురంగశాయికవిగారియెడలఁ గృతజ్ఞులమగుచున్నారము,

తండయార్పేట

ఇట్లు,

చెన్నపట్నం

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు

26-1-1926

అండ్ సన్స్