పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

శ్రీకృష్ణలీలల దెల్పు నీశతకము మాతండ్రిగారి చిరకాలమిత్రులును విజయనగర సంస్థానాస్థానపండితులు నగు శ్రీమాన్ ముడుంబై వేంకటరామనృసింహాచార్యస్వామిగారిచే రచింపఁబడినది. వీరు సజీవులై విజయనగరమునందే యుంటున్నారు. శ్రీకూర్మముదగ్గఱ వంశధారానదీతీరస్థమగు అచ్యుతపురి వీరిజన్మస్థానము. ఈ మనోహరమగు శతకమును శతకసంపుటమునఁ జేర్చుటకు వీరు అనుజ్ఞ దయచేసినందులకు కృతజ్ఞులము.


తండయార్పేట

ఇట్లు

చెన్నపట్నం.

వావిళ్ల . రామస్వామిశాస్త్రులు

16-4-26.

అండ్ సన్స్