ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పీఠిక
శ్రీకృష్ణలీలల దెల్పు నీశతకము మాతండ్రిగారి చిరకాలమిత్రులును విజయనగర సంస్థానాస్థానపండితులు నగు శ్రీమాన్ ముడుంబై వేంకటరామనృసింహాచార్యస్వామిగారిచే రచింపఁబడినది. వీరు సజీవులై విజయనగరమునందే యుంటున్నారు. శ్రీకూర్మముదగ్గఱ వంశధారానదీతీరస్థమగు అచ్యుతపురి వీరిజన్మస్థానము. ఈ మనోహరమగు శతకమును శతకసంపుటమునఁ జేర్చుటకు వీరు అనుజ్ఞ దయచేసినందులకు కృతజ్ఞులము.
తండయార్పేట
ఇట్లు
చెన్నపట్నం.
వావిళ్ల . రామస్వామిశాస్త్రులు
16-4-26.
అండ్ సన్స్