పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32


సీ.

భాగవతంబునఁ బాక్షికుఁ డై కవి
                    వాస్తవంబులు కొన్ని వదలినాఁడు
.............................................
దక్షాధ్వరమునకు దనుజారి వచ్చిన
                    లేదని చెప్పెను
.............................................
శ్రుతియుఁ బలుకుట పోతన చూడఁడేమొ.

122

ఇటులె మతావేశములగు నంశములకు నితరమతనిందలకుఁ దార్కాణలు కాంచనగును. కేవలమతధర్మములు దెలుపుశతకకదంబములో నీశతక మొకటియైయున్నది. చిరకాలముక్రింద నీశతకము తప్పులతడికగా ముద్రింపఁబడి యుంటచేఁ గవిభావానుసారముగఁ గొంచెము సవరించి శుద్ధప్రతి సిద్ధపఱచి యీశతకము ప్రచురించితిమి.

ఈశతకకర్త రమారమి 40 సంవత్సరములక్రిందట లింగైక్యము నొందెను. శైవమతోద్బోధకమగు అన్వాదకోలాహల మంతప్రౌఢముగా నీశతకము లేకున్నను ఇందలిపద్యములు సుబోధకములై మతావేశమున కనుగుణముగ నుద్రేకకరములుగా నున్నవి.

ఈకవి యితరగ్రంథములకొఱ కాంధ్రులు యత్నించిన విరశైవమతగ్రంథమండలికిఁ దోడ్పడినటు లగును.

నందిగామ.

ఇట్లు భాషాసేవకులు,

1-1-26.

శేషాద్రిరమణకవులు, శతావధానులు