పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

407

ఈపద్యభాగమువలనఁ గవి రాజసత్కృతుల నొందినటులఁ దెలియుచున్నది. ఆరాజులపేరులఁ దెలిపియుండునేని కవికాలము సులభముగా గురుతింప వీలుచిక్కెడిది. ఈకవిజీవితచరిత్రమునకు నితనిగ్రంథములకుఁ దాడెపల్లివాస్తవ్యులగు కవివంశీయులు కృషి చేసి భాషాభిమానమును బ్రచురింపవలసినయావశ్యకత విశేషించి కలదు.

అఱువదిరెండుసంవత్సరములక్రింద మదరాసులో ముద్రితమైన దోషవంతమగు నొకజీర్ణప్రతి నాధారపఱచికొని కవియభిప్రాయములను గుర్తించి సవరించి యెటులో ప్రయాసమీఁద నీశతకమునకు శుద్ధప్రతి వ్రాయఁగలిగితిమి. ఇతనికవితలో నందందు స్వల్పలోపములు గలవు. ఇట్టివి పానకములో నెలసులవంటివి. ఇతనిశతకములన్నియు ముద్రితములు కాకుంట పరితాపకరము.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు

శేషాద్రిరమణకవులు

1.2.25

శతావధానులు