పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

406

నేత్రదర్పణమునఁ బానకాలుకవి సహజముగఁ దనజన్మభూమిని గొనియాడియున్నాఁడు. తాడేపల్లి కొండలసంఖ్య పదిరెండు, రెండునదులు పురి నొరసి పాఱుచున్నవి. నృసింహుఁడు గ్రామదైవతము. కొండపై నొకపూర్వదుర్గముగలదు. ఉన్నంతలో సరిపుచ్చుకొని మాతృభూమి గౌరవమును వేనోళ్లఁ గొనియాడుపానకాలుకవి ధన్యుఁడు.ఇతనికవిత మృదుమధురముగా నుండును. ముఖ్యముగా నితనిశతకములలో మానసబోధశతకమున కున్నంతప్రశస్తి మఱియొకదానికి లేదు.

ఈ పార్థసారథిశతకము తిరువలిక్కేణి పార్థసారథిస్వామినిగూర్చి రచింపఁబడినది. ఇందలిపద్యములు విష్ణులీలలను గొండాడుచు శ్రావ్యముగఁ బఠనీయముగ, మనోహరముగనున్నవి. కవి మంగళగిరిపానకాలరాయనిభక్తుఁడు కావున పానకాలరాయఁ డని పేరుదాల్చియుండును. ఇతనికవిత పానకమువలె మధురముగానుండుననుటలో సంశయ మించుకేనియు లేదు. కవి తనప్రశస్తిని నేత్రదర్పణమున నిటులు జెప్పికొనియున్నాఁడు:

గీ. అఖిలరాజాధిరాజసభాంతరాగ్ర
     పూజితుఁడ సర్వవిద్యావిరాజితుఁడను