పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకమునకు మాతృక జీర్ణాతిజీర్ణమగు వ్రాఁతప్రతి భువనగిరి(నిజామురాష్ట్రము)లోలభించెను. ప్రతి కాగితముపైఁ జిరకాలముక్రింద వ్రాయఁబడియుంటచేఁ గాకితములు చివికి వర్ణస్వరూపము నశించియుండెను. వ్రాఁతలోపములు మిక్కుటముగాఁ గలవు. లేఖకుఁడు భాషాపరిచయుఁడు కాకపోవుటచేఁ దెలియక కొన్నిచోటులఁ బద్యభాగములలో విడచిపెట్టెను. ఇట్టి జీర్ణాతిజీర్ణమగుప్రతి మామిత్రులగు మక్కపాటి వేంకటరత్నకవిగారివద్దఁ గైకొని పఠింపఁ గవి గొప్పవాఁడై యుండుననియు లేఖకలోపములచే శతకప్రశస్తి మాటుపడెనని నిశ్చయించి ప్రత్యంతరము మిగుల శ్రమమీఁద వ్రాసితిమి. పిదప వేంకటరత్కవిగారి సహాయముతో మాతృకానుసారముగఁ బ్రత్యంతరమును సవరించితిమి. మూలమునందె కొన్నిపద్యము లన్వయదుష్టములై యుంట చేఁ గవ్యభిప్రాయము తెలియరామిచే నటులెయుంచి సామాన్యములగు లేఖకప్రమాదములు సవరించితిమి.

ఈశతకరచయిత యెవరో యేకాలమున నుండెనో కాల మేదియో యెఱుంగనగు నాధారము లిందుఁ