పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

శివశతకము వ్రాసినకవినామము తెలుపుపద్యములు మేము ప్రత్యంతరము వ్రాసికొన్న మాతృకలో లేవు. మాకుఁ జిక్కిన ప్రతి యొక్కటియే యగుటవలనను నూటయెనిమిది పద్యములకు నందింకఁ కొన్ని కొఱుఁతపడియుండుటవలనను ప్రత్యంతరసహాయము లేకుంటవలనను రచయితను నిర్ణయింప వీలులేకపోయినది. శతకకర్త పద్యములలోనివిషయములనుబట్టి చూడ వీరశైవుఁడని తోఁచుచున్నది. చెన్నబసవఁడు, బసవేశ్వరుఁడు, శివనాగుమయ్య, నిమ్మవ్వ, ధూర్జటి, ఉద్భటారాధ్యుఁడు లోనగువీరశైవుల నీకవిస్తుతించుట యీయూహకుఁ దార్కాణముగా నున్నది. కవి వీరశైవుఁడని నిరూపింప వీలుచిక్కినది. కవికాలమును గుఱించి ప్రయత్నింప నొకస్వల్పావకాశ మీశతకమునఁ గలదు.

ఈశతకమున రచయిత వీరశైవులగు శివభక్తుల ప్రభావముల నెన్నుచు ఆంధ్రకవులలో నగ్రేసరుఁడగు ధూర్జటికవి నిటులఁ బ్రశంసించినాఁడు.