పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముకుందశతకము

251


గమఠాకృతి మందరగిరి
సమధికత వహింపలేదె సదయ ముకుందా.

30


క.

ధరణీమండల మెల్లను
సుర లద్భుతమందఁ జాపచుట్టినగతి దాఁ
బరగించిన హేమాక్షుని
హరియింపఁగలేదె దంష్ట్రి వగుచు ముకుందా.

31


క.

డింభకవిద్వేషిని గని
స్తంభమున నృసింహలీలఁ దాల్చి తునుమ వే
అంభోరుహసంభవభవ
జంభాంతకముఖులు వినుతి సలుప ముకుందా.

32


క.

బలిదైత్యుని మూఁడడుగులు
బలిమిని భూదాన మడిగి ప్రాబల్యమునన్
జలజభవాండము రెండడు
గులు గొలువవె వటుఁడవై వికుంఠ ముకుందా.

33


క.

పరశువు గైకొని నృపులను
దురమున ముయ్యేడుసార్లు దునుమాడి యశం
బరుదుగ జగములు నిండఁగఁ
బరప భార్గవుఁడ వగుచుఁ బరమముకుందా.

34


క.

దశరథునకుఁ బుత్త్రుఁడవై
దశవదనముఖోగ్రదైత్యతతి నణఁచిననీ
యశమును గొనియాడఁగ నల
దశశతవదనునకునైనఁ దరమె ముకుందా.

35