పుట:2015.390519.Shashamka-Vijayamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

103


గీ.

వింత లేమియుఁ జూడక వివిధరత్న
కీలితము లైనగవనివాకిళ్ళు గడచి
మొగము వంచి వివర్ణుఁడై ముసుఁగు వెట్టి
నగరిపుఁడు నిచ్చ వసియించునగరి కరిగి.

140


సీ.

ఆచార్యు లిదె వచ్చి రనుచు దిగ్గన లేచి
        మోడ్పుకేల్దమ్ముల మ్రొక్కువారు
నతిరయంబున నితఁ డాపద వచ్చిన
        ట్లరుదేరఁ గత మేమొ యనెడువారు
వింతలేమో చాల వినఁబడు నేటికి
        నందు నాతని వెంబడించువారు
నాలిఁ గోల్పడినయ ట్లేలకో యిపు డింత
        యధికదైన్యముఁ జెందె ననెడివారు


గీ.

పరిజనము లెవ్వరును లేక పల్ల కెక్క
కెల్లబిరుదులు వర్జించి యేరితోడ
మాటలాడక పేదబ్రాహ్మణునిరీతి
వచ్చె ననువారు నయి సురల్ రిచ్ఛపడఁగ.

141


సీ.

కరకంకణంబులు గల్లని చెలు లిరు
        కోపులఁ జేరి వీఁచోపు లిడఁగ
వహ్న్యర్కినైరృతివరుణవాయుకుబేర
        శంకరుల్ గదిసి పార్శ్వములఁ గొలువ
సురసార్వభౌమసంగరనిరస్తపులోమ
        బలివిరామ యటంచు బట్లు పొగడ
రంభోర్వశీముఖ్యరమణీలలామము
        ల్పదపాళికోపు లేర్పడ నటింపఁ


గీ.

బాణితలమున భిదురకృపాణి మెఱయ
ననుపమానసుధర్మాసభాంతరమునఁ
బృథులచింతామణీభద్రపీఠమునను
నిండుకొలువుండు నిర్జరనేతఁ గనియె.

142


ఉ.

అగ్గిరిభేది యెంతయు బృహస్పతి దవ్వులఁ గాంచి గద్దియన్
దిగ్గన డిగ్గి దిక్పతులు దేవమునుల్ గరుడోరగాదులు