చతుర్దాంకము
65
లోచనముల బుట్టినప్పుడే మాన్పుటమంచిది.
శ్రీ:- గురువరా ! శంబుక సంయుమికిఁ గలిగినగతి యని యా మీయభి
ప్రాయము :
వ: అగును (ఆశ్చర్యముతో) నీవు కూడ స్వయమియనుచున్నాఁడవే!
శ్రీ:- ఇంద్రియ సంయమము గావించిన వాడు సంయమి కాడొకో,
దీని కేమిగాని శంబుక సంయమికి సంభవించిన దుర్గతియేమి ?
వ: రఘురామా ! మమ్మెక్క సక్కెముఁ జేయుచున్నావా? ఇప్పుడు
శిక్షించితినని చెప్పితివే ?
శ్రీ:- దేశి కేంద్రా ! క్షమింవుడు, మేమట్లు చెప్ప లేదు.
వ:-- ద్రోహుల శిక్షపాత్రులఁ జేయుపట్ల నయోధ్యపట్టణ ధీశులం
దెవ్వరును జంకువారు కారన్నమాట నీవనినది కాదా ?
శ్రీ: అగును, మేమనిన వాక్యమే.
వ: అట్లయిన శంబుకుని శిక్షింప లేదనుచున్నావే ?
శ్రీ:- శంబుక సంయమిని శిక్షించుటకుఁ బూర్వము ద్రోహియని స్థిర
పడవలయును గదా!
వ: మన వాదమంతయు “ఘట్టకుటీప్రభాతన్యాయమ”యినది. స్మృతు
లేమి చెప్పుచున్నవో వినిపింప లేదా ! స్మృతివాక్యములను బాటించు
టకన్నను రాజధర్మ మేమికలదు ? హిందూ మతమునకు స్మృతులు
మూలాధారములు. ఆస్మృతి వాక్యముల ననుష్టేయములుగా జే
యుట 'రాజధర్మము. స్మృతులు ద్విజేతరులకు దపస్స్వాభ్యాయన
ములను నిషేధించు చున్నవి. వానిని బాటింపక శంబుకుడు మత
ద్రోహముఁ జేయుచున్నాడు. నీవు వాని నుపేక్ష జేయుచు రాజ
-