ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శంబుకవధ
(ఉత్తర రామచరిత)
తృతీ యాం క ము
.
-:0:-
చిదానందాశ్రమము
(అంగదుఁకు, శంబుకుడు ప్రవేశింతురు)
శం: యువరాజా ! నీవు వెర్రిబాగులవాఁడవుసుమా! శ్రీరామచంద్రుఁ
డు నన్ను జంపుననియా నీ దుఃఖము! నామరణము వలన నార్యుల
కుఁగలుగు లాభముకన్న ననార్యులకు గలుగు లాభము మెండుగ
నుండునని నీవెఱుంగవా!
అం: మహాత్మా ! యిది యెట్లు ?
శం: నా మరణము ద్రావిడ సంఘము నందు నూతన జీవము కల్పింపదని
యా నీనమ్మకము ? ఆత్మాభిమానము గల ప్రతి జాతికిని గ్రూరదం
డనము స్వాతంత్ర్య రక్షణాశక్తిని బుట్టించును.
అం: ఇది యాత్మాభిమానము గల జూతి లక్షణమని మీరు 'సెలవిచ్చి
తిరి. ఇది యనార్యులమయిన మనకు నన్వయించునాయని యురి
యాడుచుంటిని,