22
శంబుకవధ
(శ్రీరాముఁడు, హనుమంతుఁడు, అంగదుఁడు ప్రవేశింతురు)
శ్రీ:_ అంగదా ! చిరకాలమునకు మమ్ము దర్శింపవచ్చితివి. వాసర
సౌర్వభౌముఁడు సుఖముగ రాజ్య మేలు చుండెనా! మమ్మేమయిన,
దలపోయు చుండునా ?
అం:--- దేవా ! హసాదు, మీయాజ్ఞా బద్ధుఁడై కదా కిష్కింధాపుర
మున వానర సార్వభౌముఁడు రాజ్యముఁ జేయుచుండుట ! మిమ్ముఁ
దలంపని నిమిష మొక్కటి యయిననుండునా? అందు సుగ్రీవ సార్వ
భౌముడు మిమ్ము దలంప కుండునా ! ఆమరణాంతము కృతజ్ఞుడనై
యుండ దగిన సాహాయ్యము చేసితి రని చెప్పు చుండును.
హ:- (తనలో) ఏమి యువరాజు మాటలు వ్యంగ్యప్రధానముగా
నున్నవి. ఏలాగో వీని చర్యల నుమానాస్పదములుగాఁ గన్పట్టు
చున్నవి.
శ్రీ:- కుమారా ! అంగదా !! మేము చేసినది కడు నల్పకృత్యము
సుమీ. మాపినతండ్రి మిగుల ప్రబుద్ధుఁడగుటచే మాయందుఁ
గడుంగడుఁ గృతజ్ఞుఁడై యున్నాడు.
అం:- (తనలో) నిజముగ నల్పకృత్యమే (ప్రకాశముగా) దానికే
రేయింబవళ్లాంతరంగికులతోఁ జెప్పికొని యువ్విళ్లూరుచుండును.
దేవరవారికి నాకస్మికముగా వాటిల్లిన యాఫత్తునకుఁ గుందికుంది
వెంటనే నన్ను మీకడకంపెను.
శ్రీ:- అంగదా ! తీర రానియిక్కటే కాని, .
సీ॥ కాక పక్షంబులు ,గల్గని పసినాఁడె
దేశముల్ ఋషితోడ • దిమ్మదిరిగి
కనులలో బెట్టుక' . యనుకంప సాకిన
ఫితృమరణంబుచే • వెగటు చెంది