20
శంబుకవద్గ
చై: ద్రావిడులయందు నూతనశక్తి యొండుద్భవిల్లినది. ఆర్యులతో
సమానస్వత్వమును గోరుచున్నారు. దీని కంతకును మూలకంద
మా శంబుకుఁడు. వానిని గడ తేర్చినఁగాని యీయాందోళనము
సమసిపోవదు.
సో.యా:- అయి తే నీవు శంబుకు నెఱుంగుదువా ! వాడెంతపనిఁ జేయు
చున్నాడు. తొల్లి తపోభంగమై ద్రావిడుఁడై పుట్టెను గాఁబోలు.
చై:- ఆఁయెఱుంగుదును, పరమసాధువు, విజ్ఞాని, పరాప కాగముఁ
దల పెట్టడు.
సో.యా: నీమాటలు చిత్రముగా నున్నవి.అట్లయినచో నిది యంతయు
నేమిటి ? ఎందులకు వచ్చినపని ?
చై:- ప్రజలందఱు సమానముగాఁ బరిపాలింపఁబడ వలయు
ననియు, సమానమగు హక్కులుండ వలయుననియు నాతని
వాదము. అందులో మత విషయమున నీషణ్మాత్ర మైన భేద
ముండఁ గూడదని యాతని యభిప్రాయము. అందుచే నతఁ
డిట్లు చేయు చున్నాడు.
సో.యూ:- అట్లయి తే ఋషి ప్రోక్తములగు గ్రంథములన్నియు సున్న
చుట్టవలసిన దేనా ?
చై- స్వత్వసామాన్యమునకుఁ బ్రతిబంధకములగు నీతులన్నియు గర్హ్య
ములనియే యాతని యభిప్రాయము.
సో.యా: ఓహో ! కొంపకు నిప్పు ముట్టించు చున్నాఁడే ! అతడిప్పు
డెక్కడనున్నాడు?
చై:- మన పట్టణంబునకుఁ బరిసరంబున నే సరయూ నదీ తీరమునఁ జిదా
నందాశ్రమమని పేరు పెట్టుకొని యొక యాశ్రమము నిర్మించుకొని
తపస్సు జేసికొనుచు, నప్పుడప్పుడు శిష్యులకుఁ దత్వోపదేశము
గావించు చుండును.