6
శంబుక వధ.
సమస్కరించి, యర్ఘ్య పాద్యాదులొసంగి, యాత్మశాంతిని జేసి
కొందురు.
( తెరలో) ఆత్మశాంతికి నతిథి పూజయే యుత్తమోత్తమ మని
మీరు నిరంతరము సెలవిచ్చుచుందురు కదా. ఇదిగో! యతిథిని
గొని వచ్చితి.
శం: కుమారా ! నీవేనా ? యింత యాలస్య మేలచేసితివి ? ఎవ్వ
రా యతిథి ? నీవు పోయి పూజాద్రవ్యములను గొనిరమ్ము. ఈశ్వ
రో ద్దేశము చేతను, రాజోద్దేశముచేతను సేవయేకదా మనకు గర్త
వ్యము.
(శిష్యుడును, అంగదుఁడును బ్రవేశింతురు.)
శి: ఇడుగో! యతిథి. గుర్వాజ్ఞును నెఱు వేర్చుటకుఁ బోయెదను.
(నిష్కమించును)
.
అం:-కిష్కింధాపురయువరాజు, అంగదుడు నమస్కరించుచున్నాడు.
శం: వత్సా! ! చిరకాలము మనుము. నిన్ను జూచుటచే నాకానం
దము గల్గుచున్నది. దారితప్పి వచ్చినట్లున్నది. 'సుగ్రీవమహారాజు
సుఖముగ రాజ్యమేలుచుండెనా ! కిష్కింధాపురపౌరు లెల్ల రానం
దముతో వర్ధిల్లుచుండిరా !
అం:మీ యనుగ్రహమువలన నెల్లరు సుఖముగఁ గాలయాపనము
జేయుచున్నారు. రామచంద్ర దర్శనార్థమై యఱుగుచు మార్గ
మధ్యమున భవచ్ఛిష్యునిఁగాంచి, మాయాశ్రమము పరిసరం
బున నుండు బెఱింగి పతితులను బోవనులఁ జేయు మిమ్ము సంద
ర్శించు మనంబున వచ్చితి.
శం:కుమారా ! యటులయినచో నీ రేయి మాపర్ణకుటీరమునఁ గడపి