128
అధిక్షేపశతకములు
మున్నగువానిని తారతమ్యదృష్టితో పరిశీలించి శఠులను, వారి చర్యల నధిక్షేపించెను.
దుర్గుణములను నిషేధరూపమున వివరించి సద్గుణములను కర్తవ్యము నుపదేశించు విధాన మీ శతకమున గలదు. విబుధుల గోష్ఠి విడువవద్దు కలిమెంత యున్న బీదల దెప్పగావద్దు — అను పద్యభాగము లిట్టివి.
ఈ శతకమున నానావిధములుగనున్న అధిక్షేపధోరణులలో సౌమ్యతతో పాటు తీవ్రదృష్టి కూడ ఉన్నది. ప్రతి పద్యపాదము సూక్తిప్రాయమైనది. అడిదము సూరకవి ముద్ర ఈ సందర్భములలో ప్రస్ఫుటముగా నున్నది. ఊళ్లు దోచుక రాతి గుళ్ళు గట్టగ నేల — మాన్యముల్ కబళించి మఖము సేయగ నేల — యడవుల చెట్లెక్కి యాడు కోతికి రత్నసౌధాగ్రసీమ సంచార మేల—” అని అన్యాపదేశముగ నధిక్షేపించిన సందర్భములలో కవి దృష్టికి వచ్చిన వ్యక్తులు వారి దుర్గుణములే స్ఫురించుచున్నవి. భావోన్నతికి అనుగుణమైన భాష, నిశితమును హృదయస్పర్శిగను సాగిన వ్యక్తీకరణవిధానము శతకము బహుళజనాదరణము నొందుటకు తోడ్పడినది. సమకాలికవ్యవస్థకు దర్పణరూపమైన ప్రశస్తశతకముగా రాణించినది.