పుట:2015.373190.Athma-Charitramu.pdf/652

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 610

భీమవరము వెళ్లునప్పటికి నాచరిత్రమునందలి ప్రథమభాగము శుద్ధప్రతి వ్రాసి, భీమవరము నరసాపురముల కదితీసికొనిపోయి, నాసోదరీసోదరులకును, ఒకరిద్దఱు మిత్రులకు నది చదువనిచ్చితిని. అంత నా నవంబరు డిసెంబరు నెలలలో మిగిలిన మూఁడుభాగములును బూర్తిపఱిచితిని. వాని శుద్ధప్రతిని వ్రాయుటకే నా కెంతో ప్రయాసకలిగెను.

1932 వేసవిని దంపతుల మిరువురమును భీమవరములో నుంటిమి. మాతమ్ముఁడు వెంకటరామయ్య కుటుంబమును మేమును గలసి మాక్రొత్తయింట నివసించితిమి. ఇంటఁ గొన్ని మరమ్మతులు చేయించితిమి. నాభూముల శిస్తులు పోగుచేయుచును, భూముల వమరకపఱచుచును, నేను వేసవిని భీమవరప్రాంతములందుఁ గడపితిని.

ఇటీవలనే ఢిల్లీలోజరిగెడి దేశీయమహాసభ కేగుటకుఁ బ్రయత్నించుటవలన నానగరమునఁ గారాగారాబంధితులై విడువఁ బడియు, మరల జూనునెలలో గుంటూరులో రక్షకభటులచే బంధితులయిన కొండ వెంకటప్పయ్యగారి దేహారోగ్యవిషయమై యాయనబంధువులు మిత్రులును మిగుల నలజడిపడిరి. వెంకటప్పయ్యగారిభార్యకును దేహములో రుగ్ణత హెచ్చెనని మాకుఁ దెలియవచ్చెను.

4. హరిజనోద్యమము

1931 వ సంవత్సరమధ్యమున నేను రచించిన "వీరేశలింగసంస్మృతి" ఆంధ్రవిశ్వవిద్యాలయమువారి ప్రాపుగాంచ నేరకున్నను, చెన్నపురి సర్వకళాశాలవారి యాదరణ భాగ్యమును గొంత చవిచూచెను. 1934 వ సంవత్సరమందలి యింటరు మీడియేటుపరీక్ష కాంధ్రమున నీపుస్తక మొక పఠనీయ