పుట:2015.373190.Athma-Charitramu.pdf/603

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25. కథావిరచనము 561

కుమారుఁడు కృష్ణారావు చెన్నపురికిఁ బ్రయాణము గట్టెను. ఆ పరిక్షలో నతని కపుడు జయము గలిగెను.

మా చెల్లెలి రెండవకుమార్తె సీతమ్మ ప్రసవముకాలేక బాధనొందుచున్న దని నాకు డిశెంబరు 5 వ తేదీని కాకినాడనుండి తంతివచ్చెను. నేను మఱునాఁటి రెయిలుమీఁద కాకినాడ చేరునప్పటికె సీతమ్మ సుఖప్రసవ మయ్యెననియు, మగపిల్లవాఁడు కలిగె ననియును నాకుఁ దెలిసెను. వారిని గుఱించి కొన్ని యేర్పాటులు చేసి, నేను నెల్లూరు వచ్చివేసితిని.

డిసెంబరు సెలవులలో పోడూరి వెంకయ్యగారి రెండవ చెల్లెల్లిపెండ్లి, నెల్లూరిలో మాయింటనె జరిగెను. ఆ వివాహసందర్శనార్థమై వచ్చిన మాతమ్ముఁడు వెంకటరామయ్య, భార్య, పిల్లలును మాతోఁ గలసి మద్రాసువచ్చిరి. ఆనగరమున వినోదములు చూచుచుఁ గొన్ని దినములు గడపి, మే మంత గుంటూరు వెడలి పోయితిమి.

25. కథావిరచనము

1922 వ సంవత్సరము ఫిబ్రవరి 12 వ తేదీని మాతమ్ముఁడు కృష్ణమూర్తియొద్దనుండి నాకు తంతిరాఁగా, నేను మఱునాఁడు కొండపల్లి పయనమయితిని. కొండపల్లికిఁ జేరువనుండు వెలిగలేటిలో కృష్ణమూర్తి పెద్దయల్లునికి మిగుల జబ్బుగనుండెననియె యావార్త. కాని, నేనచటికిఁబోవునప్పటికె యా యువకుఁడు చనిపోయెననియు, అతనికుటుంబము, మాతమ్ములు, ఆఁడువాండ్రును వారిగ్రామము జగన్నాధపురము వెడలిపోయిరనియు నేను వింటిని. చనిపోయిన