పుట:2015.373190.Athma-Charitramu.pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. దు:ఖోపశమన ప్రయత్నములు (2) 525

"దయాళసింగు కాలేజికి ధనము బాగానున్నది. లాహూరు కాలేజీలలో నిదియె మిగుల ధనవంతమైనది.

"నే నున్నానను ధైర్యముతో మీరు రావలె ననుకొనుచున్నారు...సాధ్యమైనంత త్వరలో నేను మనవైపు రావలెనని యున్నది. ఇక్కడ శీతలము ఉష్ణము అతి విశేషము. కూరలు మంచివి దొరకవు. చచ్చు బెండకాయలు, బటాణీలు, గోబీపువ్వు, కందచేమలును తప్ప మరేమి దొరకవు. నేయి అతిప్రియము. నోటబెట్ట నసహ్యము ! పాలుమాత్రము చౌక. నీటివసతి బాగా లేదు.. ప్రశస్తమైన గుంటూరుపని వదలి, ఇంతదూరము మీ వయస్సులో వచ్చుట అసమంజసము....భ బంగారయ్య."

మిత్రుని యుత్తరమువలన నా సంశయవిచ్ఛేద మయ్యెను. మేము స్థానము వీడుట నాభార్య కసమ్మతము. మమ్ముఁజూచిపోవుట కిపుడు గుంటూరువచ్చిన మాతమ్ముఁడు వెంకటరామయ్యకూడ నిష్టపడలేదు. పర్యవసానము, నా కీయుద్యోగ మక్కఱలేదని మాఱు తంతి నిచ్చివేసి, తమ కిచ్చినశ్రమకు మన్నింపుడని యచటి మిత్రులకు వ్రాసివైచితిని. లాహూరు ఉద్యోగమునకై నేను జేసిన కృషి యంతయు నిట్లు వృథాప్రయాస మయ్యెను !

18. దు:ఖోపశమన ప్రయత్నములు (2)

1916 వ సంవత్సరము డిశంబరు 31 వ తేదీ దినచర్య యందు నే నిటు వ్రాసితిని : - "ప్రార్థన సమాజమున నేను ఉపాసనను జరిపితిని. ప్రార్థనచేయుటకు మిగుల లజ్జ నొందితిని. చిన్నపిల్లవాని మరణమునకుఁ బిమ్మట దేవు నారాధించుట కిదియె