పుట:2015.373190.Athma-Charitramu.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16. 'అబ్బావు' మరణము 513

తరగతి. పెద్దవస్త్రములను ధరించువారు తెలుఁగువారలలో నాఁడువారును, బంగాళావారిలో మగవారును. అక్కడ పుణ్యాంగనలు రంగుచీరలె ధరింతురు. తెల్లని కోకలు గట్టువా రా దేశమున వెలయాండ్రు. కాని, మనకును వారికిని సామాన్యగుణములును లేక పోలేదు. హిందూశాస్త్రపద్ధతులు, సంప్రదాయములును హిందువు లందఱికిని ముఖ్యములే.

గుంటూరిలో డిప్యూటి కలక్టరుపదవి నందిన శ్రీ జయంతి రామయ్యపంతులుగారి ప్రోత్సాహమున మే మిపు డానగరమున "ఆంధ్రసాహిత్యపరిషత్తు" సభ జరుపఁదలంచితిమి. 14 వ మార్చిని నా యధ్యక్షతక్రింద జరిగిన బహిరంగసభలో, సమ్మానసభ యొకటి యేర్పడెను. కొండ వెంకటప్పయ్యగారి నధ్యక్షులుగను, ఉలుగుండము రంగారావుగారిని నన్నును కార్యదర్శులగను నెన్నుకొనిరి. మే మంత చందాలు పోగుచేసి, సభలకుఁ గావలసిన వసతులు గలిపించితిమి.

ప్రతినిధులకు పురవిద్యాలయమున విడిదలు భోజనములు నేర్పాటు చేసితిమి. విద్యార్థుల స్వచ్ఛందసేవాదళము మంచి సాయము చేసెను. ఏప్రిలు 22-23-వ తేదీలందు కళాశాలాభవనమున బహిరంగ సభలు జరిగెను. బొద్దనాయకూరు జమీందారులు అధ్యక్షులు. వేదము వేంకటరాయశాస్త్రిగారు, రాజా మంత్రి ప్రెగడ భుజంగరావుగారు మున్నగు ప్రముఖులు విచ్చేసిరి. సభలు జయప్రదముగ జరిగెను.

16. 'అబ్బావు' మరణము

గుంటూరు సభలు ముగియఁగనే మా పిల్ల వానిని, ఇక్కడఁ జదువుచుండు మా తమ్ముని కుమారుఁడు నరసింహమును దీసి