పుట:2015.373190.Athma-Charitramu.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. వెంకటరత్నమునాయఁడుగారు 475

విలంబన మయ్యెనేని, భూవసతికి మాఱుగా గృహకల్లోలములు పెచ్చు పెరుఁగునని నేను హెచ్చరించుటచేత, 1908 వ సంవత్సర మధ్యమున సోదరులము వేఱుపడితిమి. నేను జెప్పినచొప్పుననే, మేము వేఱుపడిన పిమ్మట, సోదరులలో వైషమ్యములకు మాఱుగా స్నేహభావ మతిశయించెను. దైవానుగ్రహమున వేఱువేఱుగ మంచియాస్తిని సంపాదించుకొనఁగలిగితిమి. చీఁకటి రాత్రుల వెనుక వెన్నెల రేలు వచ్చెడి విధమునను, వేసవి యెండల పిమ్మట తొలకరి వానలు గుఱియుచందమునను, వెనుకటి యార్థికదుర్దశ తొలఁగిపోయి, మాసంసార పరిస్థితు లంతటినుండియు మిగుల తృప్తికరముగ నుండెను.

1908 వ సంవత్సరాంతమున రాజమంద్రి పురమందిరమున జరిగిన వీరేశలింగ పుస్తకాలయ వార్షిక సభకు నన్నధ్యక్షునిగఁ గోరిరి. నేనపుడు రాజమంద్రి పోయి, పురమందిరమున వీరేశలింగముపంతులు గారిని, రాజ్యలక్ష్మమ్మగారిని సందర్శించితిని. వారిరువురు నపుడు పరిపూర్ణారోగ్య మనుభవించుచుండిరి.

10. వెంకటరత్నమునాయఁడుగారు

1891 వ సంవత్సరమున మొదట మద్రాసులో కలసికొని నప్పటినుండియు, వెంకటరత్నమునాయఁడుగారికిని నాకును మనసు గలిసిన మైత్రి యేర్పడెను. నాప్రియగురువులగు వీరేశలింగము పంతులుగారికిని, ప్రియమిత్రులగు కనకరాజు గంగరాజుగార్లకును నే నెఱిఁగింపనొల్లని సందేహములను రహస్యములను, నాయఁడుగారికి నేను జెప్పి, వారియోజనలను సమాధానములను స్వీకరించు చుండువాఁడను. మతవిషయములందు నాకువారిసహవాస సంభాషణముల వలనఁ గలిగిన లాభ మింకొకరి మూలమునఁ గలుగలేదని చెప్ప