ఉపోద్ఘాతము.
గ్రంథకర్త యేపుస్తకము వ్రాసినను, అది యాతని యాత్మ, చరిత్రమె యగునని యొక సుప్రసిద్ధ రచయిత నుడివెను. మనరచనములు అద్దములవలె మనయభిప్రాయములను ప్రతిఫలనము చేయుచుండును. మన కొంకిగీఁత లెల్ల మన జీవితకథనే గీయుచున్నను, ఎంతజాగ్రత్తతోఁ జిత్రించిన జీవితచిత్రములందును, కొంకరగీఁతలు గానిపించుచునే యుండును ! ఇతర రచనములందుకంటె నాత్మకథా సంవిధానమున భ్రమప్రమాదముల తాఁకు డధికముగఁ గానవచ్చును. పరులరూపమును జిత్రించుపట్ల నెంతో నిపుణతచూపు మనవ్రేళ్లు, సొంత ప్రతిమను గీయునపుడు వణఁకజొచ్చును ! అహంభావము, పక్షపాతబుద్ధి మున్నగు దుర్ల క్షణములు మనల నావేశించి, సత్యపథమునుండి యొక్కొకసారి మనపాదములను పెడదారులఁ బట్టించు చుండును. ఐనను, రోటిలోఁదల దూర్చినవాఁడు రోఁకటిపోటులకు వెఱచునా ? తన జీవితకథను ధారాళముగ వినిపింపసాహసించిన కథకునికి, చిన్నకల్లలచేఁ దన నెరసులు కప్పి పుచ్చ నెంచుట సిగ్గులచేటుగదా !
సత్యప్రకటనమె ముఖ్యావధిగఁ జేకొనిననేను, కీర్తిధనాదుల మీఁదఁ గన్నువేసి, యీ పుస్తకరచనమునకుఁ బూనుకొనలేదు. ఇదివఱలో నాత్మచరిత్రము నాంధ్రమునఁ బ్రుచురించిన ముద్గురు వర్యులగు కీ. శే. కందుకూరి వీరేశలింగముపంతులుగారి "స్వీయచరిత్రము"ను, గాంధీమహాత్ముని "ఆత్మకథ"ను మించనెంచి నే నీపుస్తకమును వ్రాయలేదు. ఆగ్రంథకర్తలు మహామహులు, నాదర్శ,