పుట:2015.373190.Athma-Charitramu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39. స్నేహభాగ్యము 171

౩౯. స్నేహభాగ్యము

౧౮౯౨ వ సంవత్సరము మార్చి తుదివారమున జరిగిన మా ప్రార్థనసమాజ జయంత్యుత్సవసమయమున సభ్యుల మందఱము నమితోత్సాహమున నుంటిమి. వీరేశలింగముగారు "మానుషధర్మము"ను గుఱించియు, నరసింహరాయఁడుగారు "విశ్వాసము"ను గూర్చియు, కనకరాజు "దేవేంద్రనాధు"నిగూర్చియు, నేను "ప్రేమపారిశుద్ధ్యము"నుగుఱించియు,ధర్మోపన్యాసములు చేసితిమి. బీదజనులకు అన్నదానము చేయఁబడెను. ఏకాంతప్రార్థనమునకై సారంగధరపర్వతమునకుఁ బోయి వచ్చితిమి.

వేసవికి కళాశాల మూయుటచేత పట్టణమునుండి సమాజ మిత్రులు తమ తమ గ్రామములకు వెడలిపోయిరి. సత్యసంవర్థనిని విడిచి వెంటనే నే నెచటికిని బోలేకపోయితిని. పత్రికకు వ్యాసములు వ్రాయుచును, చందాదారులతో నుత్తరప్రత్యుత్తరములు నడపుచును, నేను రాజమంద్రిలో చల్లనిగాలి ననుభవించుచుంటిని! ఇపుడు స్కాటు దొరగారు నాయింగ్లీషువ్యాసములు దిద్దుటకు నిరాకరించుటచేత, ఆంగ్లేయవ్యాసరచనయం దెక్కువజాగ్రత్త వహించితిని.

ప్రార్థనసమాజసంపర్కము వదలుకొను మని తండ్రియు మామయు నాకు హితబోధము చేసిరి. పత్రికమూలమున నాతలంపులు కార్యములును రచ్చ కెక్కుచుండెను. ఇపుడు వేలివెన్ను నుండి వచ్చిన నాభార్య, సమాజవార్షిక సమయమందలి మాచర్యలు, అచటిచుట్టముల హృదయములను గలంచివైచె నని చెప్పెను. నేను విద్యాభ్యాసమును గూర్చి శ్రద్ధఁబూని, యుద్యోగసంపాదనమునకుఁ గడంగవలయునే కాని, నిరర్థక సంస్కరణములవిషయమై కాలమును వ్యర్థపుచ్చరా దని,