పుట:2015.372978.Andhra-Kavithva.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసాత్మకం వాక్యం కావ్యమ్.

71


'హృదా తష్టం మనీషా' యను వాక్యమున సూచించియున్నారు. ఈ కావ్యశక్తి ప్రవహించుటకు మనయంతరాత్మయే మార్గము. ఈశక్తి మనలో గర్బితమై నీబిడమై యుండి యప్పుడప్పుడు కొంచెముకొంచెముగ మనకు వ్యక్తమగు విషయమును వైదిక ఋషులు 'నియతం గుహాయాం గుహాహితం గహ్వరేజిస్టమ్' అనువాక్యమున సూచించియున్నారు.

కవికీ కావ్యశక్తిసాక్షాత్కార మవసరము.

ఈనిబిడశక్తిని మనము బాగుగా గ్రహించి తత్సాక్షాత్కార బలమునఁ గవితఁ జెప్పనచో నయ్యదియే యుత్తమకవి తగాఁ బరిణమింపఁగలదు. అట్టియాత్మ సాత్కారము లేనికవి బుద్ది చాతుర్యమును మాత్ర మే ప్రదర్శింపఁ గలుగును. ఇట్టిసాక్షాత్కారజనీత కవిత్వమును గొందఱు కవులు కోలఁదిమాత్రముగఁ బ్రదర్శింపఁ గడంగుచున్నారు. అట్టివారలలో నైరిష్ కవులును, రవీంద్రనాథ ఠాకూరును, హరీంద్రనాథచట్టోపాధ్యాయులును, సరోజినీ దేవియును నెన్నఁదగినవారు. కాని యింకను విషయ మునకును, బదములకును గల యనిరుద్యసంయోగము దాప రించలేదు.

ఆధ్యాత్మికశక్తి ప్రదర్శకములగు నుత్తమ కావ్యములే కవిత్వపరమావధి యగును.

"అట్టిసంయోగము భావమునకును, భోషకును నేనాడు గుదురునో యానాఁడే యతీత ప్రతిభావంతమును, నాధ్యాత్మిక శక్తియుతమును నగు దివ్య కవిత యుద్బవింపఁగలదు.” పై వాక్యములఁ జెప్పిన యరవిందుని కావ్యమతమునకుఁ గలచిక్కులును సందేహములును సూచించి వాని నభూతము