పుట:2015.372978.Andhra-Kavithva.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ

64


ఈవిషయమున భక్తికవిత యనుప్రకరణమున విపులముగఁ జర్చించెదము.

సారాంశములు: 1. కావ్యమునకు రసమే ప్రధానము 'రసాత్మకం వాక్యమ్' అనుసూత్రమును, మమ్మటుని 'నియతికృత నియమరహితాం' అనువ్యాఖ్యానమునునాదరణీయంబులు.

కావునఁ దేలిన దేమనఁగాఁ గావ్యము స్వతంత్ర సృష్టి యేకాని పారతంత్ర్యమును సహింపదనియుఁ, గావ్యమునకు రసమే ప్రధానముగాని యన్య విషయములు గావనియు, నెన్ని విషయములయినను గావ్యమున సాధనమాత్రములుగ నేయుండ వలయుననియుఁ గావ్య గీసమనఁదగు రస ప్రవృత్తికి భంగము కల్గింప రాదనియు నే! మొట్టమొదట మన ముదాహరించిన నిర్వ చనములలో విశ్వనాథుని 'రసాత్మకం "వాక్యం కావ్యం' అను వాక్యమును బండిత రాయల 'రమణీయార్థ ప్రతిపాదళళ బ్దః కావ్యం” అను వాక్యమును దండికవి శ్రేష్ఠుని 'ఇష్టార్థ వ్య వచ్ఛిన్నా పదావళీ కావ్యం' అనువాక్యమును నించుమించు సమానార్థ కము లనఁదగి యుంటచే వీనిలో నెల్ల 'రసాత్మకం - వాక్యం కావ్యం' అనువిశ్వనాథుని వాక్యమునే కావ్య నిర్వచనముగ నంగీకరింపఁదగునని మామనవి. మమ్ంటుని “నియతికృతనియమ రహితొం హ్లాదై కమయీ మనన్యపరతంత్రాం, నవరసరుచి రాం నిర్మితి మాదధతీ భారతీ కవే....”అనువాక్యమును 'రసాత్మకం వాక్య'మ్మను నిర్వచనమునకు సంపూర్ణ వ్యాఖ్యానముగ నంగీక రింపదగును. మమ్మటుడు సామాన్య నియమాతీత స్వభావము,