పుట:2015.372978.Andhra-Kavithva.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


ఈయాశయము సఫలమగుటకొఱకై నైతికుఁడు స్వర్గమును నరకమును నను రెం డతీతలోకము లున్న వని భ్రమింపఁ జేసి నీతిపథమునఁ జరించువారికి స్వర్గలోక ప్రాప్తియు, నీతిపథమును వీడి పొపపథమునఁ జరిం చువారికి నరకప్రాప్తియుఁ గలుగునని నిర్దేశించు చున్నాఁడు. ఈనరకభీతియు స్వర్గలోక ప్రాప్తియందలీ యాస క్తియు మానవుల జీవితపథమును ననేకవిధములఁ ద్రిప్పు చున్నవి. నరకభీతిచే మానవుఁడు స్వచ్చంద ప్రవృత్తిని నిరోధించుకోను చున్నాఁడు. స్వర్గప్రాప్తికొజుకై మానవుఁడు తన కిష్టము లేనివై నను స్వచ్చంద ప్రవృత్తికి బాధగలగించునట్టి వైనను గొన్ని నియమములకుఁ గట్టుపడి కొన్ని విధుల ననుష్ఠించు చున్నాఁడు. ఇహలోకమున దండనాధికారిభయ మెటులో, పరలోకమున యమదండన భీతియు నల్లే నీతిశాస్త్రమువలని మేలును నింతయని నుడువుటకు వీలుగాడు. అట్లయ్యు నీతి శాస్త్రము కావ్యసృష్టికి నిరోధముఁ గల్పింపఁజూలవని నావిజ్ఞప్తి. ఆది యెట్లో యించుక విపులముగఁ జర్చించెదను. ధర్మశాస్త్రము నకుబలె నీతి శాస్త్రమునకును బ్రధాన నిరీక్షణము సంఘ శ్రేయమే యని మున్నే తెల్పియుంటినిగదా! కావ్యమున వ్యక్తియొక్క స్వచ్ఛంద ప్రవృత్తియే యవశ్యాలంబనీయను. మానవుని రస ప్రవృత్తియే ప్రధాసనీరీక్షణమై 'కావ్యమునకు నొక్కింత స్వతంత్ర ప్రతిభ నాపాదించును.

కావ్యము నీతిని బోధింపవ లెనా? 1. విద్యానాథుఁడు.

కావ్యము మానవజాతి శ్రేయమును బ్రధానలక్ష్యముగ నూని నీతి-ధర్మ- తర్కశాస్త్రములచే నిర్ణయింపఁబడు నియమములచేఁ గట్టుపడి, స్వచ్ఛందరస ప్రవృత్తిని నిరోధింప